టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 142

చంఢీగఢ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు పంజాబ్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. పంజాబ్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (35), సాయి సుదర్శన్ (31) రాణించారు. వృద్ధిమాన్ సాహా (13), డేవిడ్ మిల్లర్ (4), ఒమర్జాయ్ (13), షారుఖ్ ఖాన్ (8), రషీద్ ఖాన్ (3), విఫలమవ్వగా.. ఆఖర్లో తెవాటియా మెరుపులు మెరిపించడంతో టైటాన్స్ కు విజయం దక్కింది. తెవాటియా 18 బంతుల్లో 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్-3, లియామ్ లివింగ్‌స్టోన్-2, అర్షదీప్ సింగ్, సామ్ కర్రాన్ చెరో వికెట్ తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు సామ్ కర్రాన్, ప్రభ్‌సిమ్రాన్ మంచి ఆరంభాన్ని అందించినా పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. తొలి వికెట్‌కు 33 బంతుల్లోనే 52 పరుగులు జోడించారు. 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు ప్రభ్‌సిమ్రాన్. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ 4 వికెట్లు తీశాడు. మొహిత్ శర్మ, నూర్ అహ్మద్ చెరో 2, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో గుజరాత్‌ టైటాన్స్ మొత్తం నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది.

Updated On 21 April 2024 9:11 PM GMT
Yagnik

Yagnik

Next Story