పన్నెండేళ్ల నుంచి నిలిచిపోయిన జోనల్‌ క్రికెట్‌ను మళ్లీ మొదలు పెట్టడానికి హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం చర్యలు తీసుకుంటోంది. శ‌నివారం ఉద‌యం సికింద్రాబాద్‌లోని జింఖానా స్టేడియంలో పురుషుల సీనియ‌ర్ జోన‌ల్ టోర్న‌మెంట్‌లోని సెక్ర‌ట‌రీ ఎలెవ‌న్ వ‌ర్సెస్ సికింద్రాబాద్ ఎలెవ‌న్ తొలి మ్యాచ్‌ను హెచ్‌సీఏ అధ్య‌క్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్‌రావు టాస్ వేసి ప్రారంభించారు. క్రికెట‌ర్ల‌ను ఖాళీగా ఉంచ‌కుండా ఏడాది పొడువునా ఏదొక టోర్న‌మెంట్‌లో

పన్నెండేళ్ల నుంచి నిలిచిపోయిన జోనల్‌ క్రికెట్‌ను మళ్లీ మొదలు పెట్టడానికి హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం చర్యలు తీసుకుంటోంది. శ‌నివారం ఉద‌యం సికింద్రాబాద్‌లోని జింఖానా స్టేడియంలో పురుషుల సీనియ‌ర్ జోన‌ల్ టోర్న‌మెంట్‌లోని సెక్ర‌ట‌రీ ఎలెవ‌న్ వ‌ర్సెస్ సికింద్రాబాద్ ఎలెవ‌న్ తొలి మ్యాచ్‌ను హెచ్‌సీఏ అధ్య‌క్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్‌రావు టాస్ వేసి ప్రారంభించారు. క్రికెట‌ర్ల‌ను ఖాళీగా ఉంచ‌కుండా ఏడాది పొడువునా ఏదొక టోర్న‌మెంట్‌లో ఆడించాల‌నేది త‌మ అభిమతమని జగన్మోహన్‌రావు అన్నారు త్వ‌ర‌లో జూనియ‌ర్ లెవ‌ల్‌లో కూడా జోన‌ల్ స్థాయి టోర్న‌మెంట్ నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. ఏడాదికి సుమారు ఆరు వేల మ్యాచ్‌లు నిర్వ‌హించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నామ‌ని, ఇందు కోసం కొత్త మైదానాల‌ను కూడా సిద్ధం చేస్తామ‌ని చెప్పారు.
హెచ్‌సీఏ అంటే కేవ‌లం హైద‌రాబాద్‌కే ప‌రిమితం కాదని, విశ్వ‌న‌గ‌రంతో పాటు 33 జిల్లాల్లోనూ క్రికెట్‌ను సమాంత‌రంగా అభివృద్ధి చేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నామ‌న్నారు. ఇక‌పై జిల్లాల్లోనూ క్రికెట్ టోర్న‌మెంట్లు, శిక్షణ శిబిరాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. తాను అధ్య‌క్షుడిగా ఉన్నంత కాలం హెచ్‌సీఏ జ‌ట్ల‌లో గ్రామీణ క్రికెట‌ర్ల‌కు అగ్ర‌తాంబులం ఇస్తానని, అన్ని జ‌ట్ల‌లో 50 శాతానికి పైగా రూర‌ల్ క్రికెట‌ర్ల‌కు అవ‌కాశం ద‌క్కేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నాన‌ని జగన్మోహన్‌రావు చెప్పారు. హెచ్‌సీఏ కొత్త కార్య‌వ‌ర్గంలో అనుభ‌వ‌జ్ఞులు ఉన్నార‌ని, అలాగే మాజీ క్రికెట‌ర్ల‌ స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో స‌మ‌ష్ఠిగా ప‌నిచేసి, దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ అసోసియేష‌న్‌గా తీర్చిదిద్దుతాన‌న్నారు. ఎం.ఎల్‌.జయసింహా, మ‌హ్మ‌ద్ అజ‌రుద్దీన్‌, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ వంటి దిగ్గ‌జ క్రికెట‌ర్లు జింఖానాలో ఆడి, ప్ర‌పంచ మేటి క్రికెట‌ర్లుగా ఎదిగిన చ‌రిత్ర మ‌న‌కుంద‌ని, ఆ పున‌ర్వైభావాన్ని తిరిగి తీసుకొస్తామ‌న్నారు. అనంత‌రం హైద‌రాబాద్ క్రికెట్ అకాడ‌మీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సిబ్బందితో క‌లిసి జింఖానాలో ప్రాక్టీసు నెట్స్ ఏరియా, జిమ్‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ప్రాక్టీసు చేస్తున్న యువ క్రికెట‌ర్ల‌తో ముచ్చ‌టించారు. స‌దుపాయాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే సీనియర్‌ జోనల్‌ టోర్నమంట్‌ ఈనెల 24వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఫైన‌ల్ ఈనెల 22 నుంచి 24వ తేదీ వ‌ర‌కు ఉప్ప‌ల్‌లో జ‌ర‌గ‌నుంది. గ్రూప్‌-ఎలో హైద‌రాబాద్ ఎలెవ‌న్‌, ప్రెసిడెంట్ ఎలెవ‌న్‌, రెస్ట్ ఎలెవ‌న్ ఉండ‌గా, గ్రూప్‌-బిలో సికింద్రాబాద్ ఎలెవ‌న్‌, సెక్ర‌ట‌రీ ఎలెవ‌న్‌, డిస్ట్రిక్స్ కంబైన్డ్ ఎలెవ‌న్ జ‌ట్లు ఉన్నాయి. రెండు గ్రూప్‌ల్లో టాప్‌లో నిలిచిన జ‌ట్లు ఫైన‌ల్లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ టోర్నీలోని మ్యాచ్‌లు సికింద్రాబాద్ జింఖానా, ఉప్ప‌ల్ స్టేడియాల్లో జ‌ర‌గ‌నున్నాయి.

Updated On 9 Dec 2023 7:12 AM GMT
Ehatv

Ehatv

Next Story