ఏప్రిల్ 18న ముల్లన్‌పూర్‌లోని పిసిఎ న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో

ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ దోషిగా తేలడంతో హార్దిక్ పాండ్యా భారీ మూల్యం చెల్లించుకున్నాడు. గురువారం ముల్లన్‌పూర్‌లో జరిగిన IPL 2024 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌కి 12 లక్షల రూపాయల జరిమానా విధించారు.

ఏప్రిల్ 18న ముల్లన్‌పూర్‌లోని పిసిఎ న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు జరిమానా విధించినట్లు బీసీసీఐ తెలిపింది. PBKS vs MI మ్యాచ్ తర్వాత ప్రకటనను విడుదల చేసింది. కనీస ఓవర్ రేట్ అతిక్రమణలకు సంబంధించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం జరిమానా విధిస్తున్నాం. ఈ సీజన్‌లో ముంబై జట్టు చేసిన మొదటి నేరం కావడంతో కెప్టెన్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా విధించామని తెలిపింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆఖరి ఓవర్లో ముంబై ఇండియన్స్ జట్టు కేవలం నలుగురు ఫీల్డర్స్ ను మాత్రమే 30 యార్డ్స్ బయట పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే 19.1 దగ్గర పంజాబ్ ఆలౌట్ అవ్వడంతో ముంబై పెద్ద ప్రమాదం నుండి బయటపడింది.

Updated On 18 April 2024 11:50 PM GMT
Yagnik

Yagnik

Next Story