బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. స్టీవెన్ స్మిత్ సెంచరీతో చెలరేగాడు. 140 పరుగులు చేశాడు. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అద్భుత సహకారాన్ని అందించాడు. ఒకవైపు స్టీవెన్ స్మిత్.. మరో ఎండ్‌లో పాట్ కమ్మిన్స్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆరంభంలో తడబడింది. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అత్యల్ప స్కోర్ 3 పరుగులే చేశాడు. కోహ్లీ 36 పరుగులతో మమ అనిపించాడు. రిషబ్ పంత్-28, రవీంద్ర జడేజా-17 పరుగులు చేశాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేసింది. దీంతో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టును నితీష్‌కుమార్‌రెడ్డి ఆదుకున్నాడు. నాథన్ లియాన్ బౌలింగ్‌లో బౌలర్ తల మీదుగా లాంగాన్‌లో కొట్టిన భారీ సిక్స్ అతని ఇన్నింగ్‌లో హైలైట్‌గా నిలిచింది. భారీ షాట్లు ఆడుతూ ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో తన కెరీర్‌లో తొలి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రేక్షకులకు తన బ్యాట్‌తో పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ చేసినట్లు 'తగ్గేదేలే' అన్నట్లు బ్యాట్‌తో సంజ్ఞలు చేశాడు. దీంతో ఒక్కసారిగా స్టేడియం దద్దరిల్లిపోయింది. కామెంటర్‌ కూడా 'వావ్‌ పుష్ప' అని బిగ్గరగా అరిచాడు. ఈ సమయానికి భారత్ స్కోర్ 326/7, 85 పరుగులతో నితీష్‌కుమార్‌ రెడ్డి క్రీజులో ఉన్నాడు.

ehatv

ehatv

Next Story