భారతీయ జనతా పార్టీ నాయకురాలు మాధవి లత శనివారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

భారతీయ జనతా పార్టీ నాయకురాలు మాధవి లత శనివారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. హైదరాబాద్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో అసదుద్దీన్ ఒవైసీపై మూడు లక్షలకు పైగా ఓట్ల తేడాతో మాధవి లత ఓడిపోయారు. ఒవైసీకి 6,61,981 ఓట్లు రాగా.. మాధవి లతకు 3,23,894 ఓట్లు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ మహిళా అభ్యర్థిని నిలబెట్టడం ఇదే తొలిసారి. మాధవి లత విరించి హాస్పిటల్స్ చైర్‌పర్సన్, లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ స్థాపకురాలు. తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆమె హైదరాబాద్ ప్రాంతంలో వివిధ ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆహార పంపిణీ కార్యక్రమాలను నిర్వహించింది.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఎనిమిది, కాంగ్రెస్‌ ఎనిమిది, ఏఐఎంఐఎం ఒక సీటును గెలుచుకున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు గాను బీఆర్‌ఎస్ (అప్పటి టీఆర్‌ఎస్) తొమ్మిది స్థానాల్లో గెలుపొందగా.. బీజేపీ, కాంగ్రెస్‌లు వరుసగా నాలుగు, మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి.

Updated On 23 Jun 2024 5:03 AM GMT
Eha Tv

Eha Tv

Next Story