'రాజధాని ఎక్స్‌ప్రెస్'గా ప్రసిద్ధి చెందిన బీహార్‌కు(Bihar) చెందిన లాల్ మయాంక్ యాదవ్(Lal mayank yadav) జాతీయ‌ జట్టుకు సెల‌క్ట్ అయ్యాడు.

'రాజధాని ఎక్స్‌ప్రెస్'గా ప్రసిద్ధి చెందిన బీహార్‌కు(Bihar) చెందిన లాల్ మయాంక్ యాదవ్(Lal mayank yadav) జాతీయ‌ జట్టుకు సెల‌క్ట్ అయ్యాడు. ఈ 22 ఏళ్ల ఫాస్ట్ బౌలర్‌ను బంగ్లాదేశ్‌తో(Bangladesh) టీ20 సిరీస్(T-20 series) కోసం 15 మంది సభ్యుల జట్టులో చేర్చింది సెల‌క్ష‌న్ క‌మిటీ. మయాంక్ తన పేస్, బౌన్సర్లతో IPL 2024లో విధ్వంసం సృష్టించాడు.

లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన మయాంక్ నాలుగు మ్యాచ్‌లలో ఏడు వికెట్లు పడగొట్టాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తున్న సమయంలో మ‌యాంక్‌ ప్రత్యర్థి జట్టును క‌ట్ట‌డి చేశాడు. మయాంక్ ప్రతి బంతిని గంటకు 150+ కిమీ వేగంతో వేయగలడు.

ఐపీఎల్ తర్వాత గాయపడిన మయాంక్ ఇప్పుడు పునరాగమనం చేయబోతున్నాడు. మయాంక్ తన వేగంతో బంగ్లాదేశ్‌పై విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. జాతీయ జట్టులోకి ఎంపిక కావడంతో మయాంక్ తండ్రి ప్రభు యాదవ్ కల కూడా నెరవేరింది. అక్టోబర్ 6 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

మయాంక్ జూన్ 2002లో ఢిల్లీలో జన్మించాడు. మయాంక్ తాత హరిశ్చంద్ర యాదవ్ బీహార్‌లోని సుపాల్ జిల్లాలోని మరౌనా దక్షిణ్ పంచాయితీలోని రాథో గ్రామ నివాసి. మయాంక్ తండ్రి ఢిల్లీకి మారాడు. అప్పటి నుండి మయాంక్ కూడా అక్కడే నివసిస్తున్నాడు, కానీ మయాంక్ గ్రామానికి వస్తూ పోతూ ఉంటాడు.

Eha Tv

Eha Tv

Next Story