వచ్చే నెల నుంచి భారత్‌ దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. దులీప్ ట్రోఫీతో సీజన్‌ ప్రారంభం కానుంది.

వచ్చే నెల నుంచి భారత్‌ దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. దులీప్ ట్రోఫీతో సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 5 నుండి ప్రారంభమవుతుంది, ఇందులో టీమిండియాలోని చాలా మంది వెటరన్ ప్లేయర్స్ ఆడనున్నారు. ఈ టోర్నీలో 20 ఏళ్లుగా చెరగని రికార్డు ఉంది. ఈ రికార్డు మధ్యప్రదేశ్ మాజీ బౌలర్ నరేంద్ర హిర్వానీ పేరిట ఉంది. ఈ రికార్డు ఏమిటో తెలుసుకుందాం.

దులీప్ ట్రోఫీని జోన్ల వారీగా ఆడతారు. వెస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ జోన్, ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్ పేరుతో ఐదు జట్లు ఆడతాయి. భారత మాజీ లెగ్ స్పిన్నర్ హిర్వానీ.. త‌న బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌కు చాలా ఇబ్బంది కలిగించేవాడు. అతడు టీమ్ ఇండియా తరపున కూడా ఆడాడు. కానీ జాతీయ జట్టుతో అతని కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. అయితే దులీప్ ట్రోఫీలో హిర్వాణీ పేరిట ఓ పెద్ద రికార్డు ఉంది. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. హిర్వానీ 2004లో క్రికెట్‌కు వీడ్కోలు పలికి 20 ఏళ్లు కావస్తున్నా అతని రికార్డును ఎవ‌రూ బద్దలు కొట్టలేదు. హిర్వానీ దులీప్ ట్రోఫీలో మొత్తం 29 మ్యాచ్‌లు ఆడి 126 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ ప్రదర్శన 129 పరుగులకు ఏడు వికెట్లు. ఈ రికార్డు ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ బ్రేక్ చేయ‌క‌పోవ‌డం విశేషం.

అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు

నరేంద్ర హిర్వానీ, 29 మ్యాచ్‌లు, 126 వికెట్లు

సాయిరాజ్ బహుతులే, 30 మ్యాచ్‌లు, 112 వికెట్లు

భగవత్ చంద్రశేఖర్, 24 మ్యాచ్‌లు, 99 వికెట్లు

శ్రీనివాసన్ వెంకటరాఘవన్, 26 మ్యాచ్‌లు, 95 వికెట్లు

ఎరపల్లి ప్రసన్న, 24 మ్యాచ్‌లు, 83 వికెట్లు

Sreedhar Rao

Sreedhar Rao

Next Story