రంగు రంగుల గాలిపటాలతో(Kites), కన్నుల పండుగకు హైద‌రాబాద్ వేదికైంది. ఇందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క , సాంస్కృతిక శాఖ‌ ఆధ్వర్యంలో సికింద్రాబాద్(Secunderabad) ప‌రేడ్ గ్రౌండ్‌లో నిర్వ‌హించే అంతర్జాతీయ కైట్ అండ్‌ స్వీట్ ఫెస్టివల్ ను(Kite and sweet festival) ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు.

రంగు రంగుల గాలిపటాలతో(Kites), కన్నుల పండుగకు హైద‌రాబాద్ వేదికైంది. ఇందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క , సాంస్కృతిక శాఖ‌ ఆధ్వర్యంలో సికింద్రాబాద్(Secunderabad) ప‌రేడ్ గ్రౌండ్‌లో నిర్వ‌హించే అంతర్జాతీయ కైట్ అండ్‌ స్వీట్ ఫెస్టివల్ ను(Kite and sweet festival) ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. ఇవాళ్టి నుంచి 15 వ తేదీ వరకు జరగనున్న ఈ కైట్ ఫెస్టివల్ 16 దేశాల‌కు చెందిన 40 మంది అంతర్జాతీయ కైట్ ప్ల‌య‌ర్లు, వివిధ రాష్ట్రాల నుంచి 60 మంది కైట్ ప్ల‌య‌ర్లు ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ప‌తంగుల పండుగతో పాటు స్వీట్ ఫెస్టివ‌ల్ ను కూడా నిర్వ‌హిస్తున్నారు. తెలంగాణ సంప్ర‌దాయ వంట‌లు, పంజాబ్(Punjab), గుజ‌రాత్, కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన మ‌హిళ‌లు ఇంట్లోనే త‌యారు చేసిన 400 ర‌కాల స్వీట్ల‌ను పుడ్ కోర్టుల్లో(Food court) ప్ర‌దర్శించి, విక్ర‌యించ‌నున్నారు. కైట్ & స్వీట్ ఫెస్టివ‌ల్ లో భాగంగా క‌ళారూపాల ప్ర‌ద‌ర్శ‌న‌, ఇత‌ర‌ సాంస్కృతిక(Cultural) కార్యక్రమాల‌ను నిర్వ‌హిస్తారు. హ‌స్త‌క‌ళ‌లు, చేనేత వ‌స్త్రాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రదర్శన తిలకించటానికి వచ్చే సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జీహెచ్ఎంసీ(GHMC), పోలీసు, ఇతర శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సంద‌ర్శ‌కుల‌కు ఉచిత ప్ర‌వేశం క‌ల్పించారు. మూడు రోజులపాటు జరిగే వేడుకలకు దాదాపు 15 లక్షల మంది హాజరువుతారని అంచనా వేస్తున్నారు.

Updated On 13 Jan 2024 4:07 AM GMT
Ehatv

Ehatv

Next Story