దాదాపుగా సిట్టింగులందరికీ టికెట్లు ఇచ్చి చేజేతులా ఓటమి కొని తెచ్చుకున్నారు కేసీఆర్‌(KCR). ఇదే మాటను చాలా మంది అంటూ ఉన్నారు. ఒకవేళ తీవ్ర వ్యతిరేకత ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చి, ఆ స్థానాలలో కొత్తవారికి అవకాశం ఇచ్చి ఉంటే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడే మెజారిటీ వచ్చి ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి 2018లోనే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై ప్రజల్లో పీకలదాక కోపం ఉంది. కాకపోతే కేసీఆర్‌ మొహం చూసి ఓటేశారు. పైపెచ్చు చంద్రబాబుతో(Chandrababu) కాంగ్రెస్‌(Congress) చేతులు కలపడం టీఆర్‌ఎస్‌కు(TRS) అడ్వాంటేజ్‌ అయ్యింది. అంతటి వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చకుండా కేసీఆర్‌ విఫల ప్రయోగం చేశారు. దెబ్బతిన్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చకపోతే ఏం జరుగుతుందో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి(Jagan Mohan Reddy) తెలిసివచ్చింది.

Updated On 14 Dec 2023 1:15 AM GMT
Ehatv

Ehatv

Next Story