ప్రేమకు సంబంధించిన కేసుల్లో చాలా వరకు అబ్బాయిలు ..తన ప్రేమ యాక్సెప్ట్‌ చేయడం లేదని అమ్మాయిలపై రకరకాల దాడులకు, వేధింపులకు పాల్పడిన ఘటనలు చూసాం.. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన మాజీ ప్రియుడికి (Ex boyfriend)ప్రియురాలు బిగ్ షాక్ ఇచ్చింది. 

ప్రేమకు సంబంధించిన కేసుల్లో చాలా వరకు అబ్బాయిలు ..తన ప్రేమ యాక్సెప్ట్‌ చేయడం లేదని అమ్మాయిలపై రకరకాల దాడులకు, వేధింపులకు పాల్పడిన ఘటనలు చూసాం.. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన మాజీ ప్రియుడికి (Ex boyfriend)ప్రియురాలు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ స్టోరీ వివరాలు ఏంటో చూద్దాం.... ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రంలోని ఛోటే అమాబల్ గ్రామంలో(Village) వరుడు దమ్రుధర్ బాఘేల్ (25) ఓ యువతిని ప్రేమించాడు. దమ్రుధర్ బాఘేల్ పెళ్లి(marriage) చేసుకుంటానని చెప్పి కొన్నేళ్లు ప్రేయసితో సంబంధం(Relation) పెట్టుకొని అనంతరం ఆమెను వదిలి మరో 19 ఏళ్ల యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు.

లవర్‌ పెళ్లి(marriage) విషయం తెలిసి ప్రియురాలు దమ్రుధర్ కు ఫోన్ చేసినా ప్రియుడు కాల్ ఎత్తలేదు. టీవీలో వస్తున్న ‘క్రైమ్ పెట్రోల్’ సీరియల్ చూసిన ప్రియురాలు తనను మోసం చేసిన దమ్రుధర్ పై యాసిడ్ దాడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియురాలైన యువతి మిరప పొలంలో డ్రిప్ పరికరాలను శుభ్రం చేసేందుకు తెచ్చిన యాసిడ్(Acid) బాటిల్ తీసుకొని ఛోటే అమాబల్ గ్రామంలోని పెళ్లి మండపానికి మారువేషంలో సూటు,బూటు వేసుకొని వచ్చి వరుడిపై యాసిడ్ పోసింది.

పెళ్లి(wedding) మండపంలో జరిగిన యాసిడ్ దాడిలో వరుడు, వధువు, పెళ్లికి వచ్చిన పదిమంది అతిథులు గాయపడ్డారు. పెళ్లి మండపంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు మారువేషంలో వచ్చి యాసిడ్ పోసి పరారవుతున్న యువతిని పట్టుకొని అరెస్టు చేశారు. నిందితురాలైన మాజీ ప్రేయసిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 326 ఎ కింద కేసు నమోదు చేశారు.

Updated On 25 April 2023 6:21 AM GMT
madhuri p

madhuri p

Next Story