గుజరాత్‌లో(Gujarat) దారుణం చోటు చేసుకుంది. వడాలిలో(Vadali) కూలీ పనులు చేసుకుంటూ జీతూబాయ్‌కు భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. కూలినాలీ చేసకుంటూ భార్య, ముగ్గురు పిల్లలను పోషిస్తున్నాడు. అయితే జీతూబాయి భార్య గతంలో జయంతి బాయ్(Jayanthi Bhai) అనే వ్యక్తిని ప్రేమించింది. కానీ జీతూబాయిని పెళ్లి చేసుకోవాడంతో మాజీ ప్రియుడు జయంతి బాయ్‌ ఆమెపై పగను పెంచుకున్నాడు.

గుజరాత్‌లో(Gujarat) దారుణం చోటు చేసుకుంది. వడాలిలో(Vadali) కూలీ పనులు చేసుకుంటూ జీతూబాయ్‌కు భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. కూలినాలీ చేసకుంటూ భార్య, ముగ్గురు పిల్లలను పోషిస్తున్నాడు. అయితే జీతూబాయి(Jeethu bhai) భార్య గతంలో జయంతి బాయ్(Jayanthi Bhai) అనే వ్యక్తిని ప్రేమించింది. కానీ జీతూబాయిని పెళ్లి చేసుకోవాడంతో మాజీ ప్రియుడు జయంతి బాయ్‌ ఆమెపై పగను పెంచుకున్నాడు. తనని కాకుండా వేరే వ్యక్తిని తన ప్రియురాలు పెళ్లి చేసుకుందని కోపంతో ప్రియురాలి కుంటుంబాన్ని హత మార్చాలని నిర్ణయం తీసుకొని ఓ ఆటో డ్రైవర్‌తో ఆమె ఇంటికి పార్సిల్ బాంబు పంపాడు. పార్సిల్‌ తీసుకున్న జీతుబాయ్‌ దానిని తెరిచి చూడగా అందులో ఓ టేప్ రికార్డర్‌ ఉంది. దానిని ఆన్‌ చేసిన వెంటనే అది పేలిపోయి జీతూ బాయి అక్కడికక్కడే మృతిచెందాడు. ముగ్గురు కూతుర్లకు తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురు కూతుర్లను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యోనే 12 ఏళ్ల భూమిక మృతి చెందింది. మిగతా ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్సిల్‌ తీసుకొచ్చిన ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడు జీతూబాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో జీతూ బాయి భార్య ఇంట్లో లేకపోవడంతో పోలీసులకు కూడా అనుమానం వచ్చింది. మాజీ ప్రియుడితో కలిసి తన కుటుంబాన్ని మట్టుబెట్టాలని.. ఇందులో ఆమె హస్తం కూడా ఉందేమోనన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Updated On 4 May 2024 1:58 AM GMT
Ehatv

Ehatv

Next Story