పాటలు వినడానికి మొబైల్‌ ఫోన్‌(Mobile Phone) అడిగిన పాపానికి భర్త కంట్లో కత్తెరతో(scissors) పొడించేసింది ఓ భార్యమణి. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బాగ్‌పత్‌లో(Bagpath) చోటు చేసుకుంది.

పాటలు వినడానికి మొబైల్‌ ఫోన్‌(Mobile Phone) అడిగిన పాపానికి భర్త కంట్లో కత్తెరతో(scissors) పొడించేసింది ఓ భార్యమణి. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బాగ్‌పత్‌లో(Bagpath) చోటు చేసుకుంది. యూట్యూబ్‌లో(Youtube) పాటలు వినడానికి అంకిత్‌(Ankith) తన భార్య ప్రియాంకను(Priyanka) ఫోన్‌ అడిగాడు. అందుకు ఆమె తిరస్కరించింది. 'నీ ఫోన్‌లోనే చూసుకో' అంటూ రాష్‌గా మాట్లాడింది. దాంతో ఇద్దరి మధ్య గొడవ మొదలయ్యింది. ఆ గొడవ క్రమక్రమంగా పెద్దదయ్యింది. ఓ దశలో కోపం పట్టలేక ప్రియాంక కత్తెరతో అంకిత్‌ కంట్లో పొడిచింది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. బరౌత్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ సవిరత్న గౌతమ్‌ తెలిపాడు

Updated On 29 Dec 2023 2:20 AM GMT
Ehatv

Ehatv

Next Story