అతడికి విషమిచ్చి చంపేసింది.

కర్వాచౌత్‌(karvachauth) పండుగ రోజున భర్త నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండేందుకు ఆ భార్య(wife) నిష్టగా ఉపవాసం(fasting) చేసింది. ప్రార్థనలు చేసింది. ఇది జరిగిన కొన్ని గంటలకే అతడికి విషమిచ్చి చంపేసింది. ఉత్తరప్రదేశ్‌లోని(uttar Pradesh) కౌశంబి(Kaushambi) జిల్లా ఇస్మాయిల్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సవిత అనే మహిళకు తన భర్త శైలేష్‌కుమార్‌ (32)పై ఎంతో అనుమానం. వేరే మహిళలతో సంబంధం ఉందని సందేహపడేది. కర్వా చౌత్‌ పండుగ రోజున, అంటే ఆదివారం నాడు భర్త దీర్ఘాయుష్షు కోసం సవిత ఉపవాసం ఉంది. శైలేశ్‌ పండగ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. సాయంత్రం ఉపవాసం విరమించిన తర్వాత సవిత తన భర్తతో గొడవ పడింది. అయితే కాసేపయ్యాక గొడవ సద్దుమణిగింది. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోంచేశారు(dinner). ఆ తర్వాత భర్తను పక్కింటికి వెళ్లి ఏదో వస్తువు తెమ్మని చెప్పింది. తర్వాత సవిత అక్కడి నుంచి పారిపోయింది. శైలేశ్‌ తిన్న భోజనంలో విషం కలిసిందని(Poison) తెలిసి ఆగమేఘాల మీద అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ అతడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. చికిత్స పొందుతూ శైలేశ్‌కుమార్‌ చనిపోయాడు. పోలీసులు సవితను అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 22 Oct 2024 6:11 AM GMT
Eha Tv

Eha Tv

Next Story