ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. శనివారం రైల్వే మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. సీఎం సిద్ధరామయ్య శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఇంత ఘోర ప్రమాదం గతంలో ఎన్నడూ జరగలేదు. ఇప్పటి వరకు కన్నడ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం లేదు.

Who Was Responsible Asks Siddaramaiah Over Odisha Train Crash Tragedy
ఒడిశా(Odisha)లోని బాలాసోర్(Balasore)లో జరిగిన ఘోర రైలు ప్రమాదం(Train Accident)పై విచారం వ్యక్తం చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah).. శనివారం రైల్వే మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. సీఎం సిద్ధరామయ్య శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఇంత ఘోర ప్రమాదం గతంలో ఎన్నడూ జరగలేదు. ఇప్పటి వరకు కన్నడ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం లేదు. ఈ ఘోర ప్రమాదానికి బాధ్యులెవరో రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేయాలి. నా క్యాబినెట్ సహచరుడు సంతోష్ లాడ్(Santosh Lad)ను ప్రమాద స్థలానికి పంపాను. అతను సమాచారాన్ని సేకరిస్తాడు. మరిన్ని వివరాలను మాతో పంచుకుంటాడు. మరణించిన ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనలో 1,000 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల సంఖ్య 288గా ఉందని భారతీయ రైల్వే పేర్కొంది. బాలాసోర్ జిల్లాలోని బహనాగ బజార్ స్టేషన్లో ఈ ఘోర ప్రమాదం జరిగిందని ప్రాథమిక నివేదికలు తెలిపాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్(Bengaluru-Howrah Superfast Express), కోరమాండల్ ఎక్స్ప్రెస్(Coromandel Express)కు చెందిన 17 కోచ్లు పట్టాలు తప్పాయి. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) శనివారం ఒడిశాలోని బాలాసోర్లో ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆయన వెంట కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw), కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) ఉన్నారు.
