భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ హైదరాబాద్‌లో తన కొత్త రెస్టారెంట్

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ హైదరాబాద్‌లో తన కొత్త రెస్టారెంట్ 'వన్8 కమ్యూన్‌'ను ప్రారంభించనున్నారు. HITEC సిటీలోని హార్డ్ రాక్ కేఫ్‌కు సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో ఈ రెస్టారెంట్ ను ఏర్పాటు చేయనున్నారు. మే 24న రెస్టారెంట్ ఓపెనింగ్ కు సంబంధించిన ఏర్పాటు పూర్తయ్యాయి.

కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో రెస్టారెంట్ కు సంబంధించిన స్నీక్ పీక్‌ను పంచుకున్నారు. హోటల్ ప్రారంభ తేదీని మే 24గా ప్రకటించారు. "హే హైదరాబాద్, కొన్ని ఉత్తేజకరమైన వార్తలను మీతో పంచుకోవడంలో నేను థ్రిల్డ్ అయ్యాను!"అంటూ పోస్ట్ పెట్టారు. "నాకు వన్8 కమ్యూన్ కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు-ఇది ప్రజలను ఒకచోట చేర్చడం, వారి మధ్య అనుబంధాలను సృష్టించడం" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. One8 కమ్యూన్ రుచికరమైన ఆహారంతో ఆహార ప్రియులకు, క్రీడాభిమానులకు మంచి ఆనందాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. 2017లో స్థాపించిన One8 కమ్యూన్ ఢిల్లీ, ముంబై, పూణే, కోల్‌కతా, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు విస్తరించింది. ఇప్పుడు.. హైదరాబాద్ One8 కమ్యూన్ స్థానంతో జాబితాలో చేరింది.

Updated On 24 May 2024 12:29 AM GMT
Yagnik

Yagnik

Next Story