కారుకు(Car) సైడ్‌ ఇవ్వలేదని ఓ మహిళను ముక్కు పగిలేలా కొట్టాడో వ్యక్తి.

కారుకు(Car) సైడ్‌ ఇవ్వలేదని ఓ మహిళను ముక్కు పగిలేలా కొట్టాడో వ్యక్తి. అది కూడా ఆమె పిల్లల ముందే! మహారాష్ట్రలోని(Maharashtra) పూణెలో(Pune) ఈ ఘటన జరిగింది. జర్నిల్‌ డిసిల్వా అనే 27 ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటీపై పూణెలోని బనెర్‌-పాషన్ రోడ్డుపై వెళుతున్నార, అద సమయంలో ఆమె వెనుకాల స్వప్నిల్‌ కెక్రే అనే వ్యక్తి కారులో వస్తున్నాడు. రెండు కిలోమీటర్ల అలా ప్రయాణించి ఆ తర్వాత ఆమెను ఓవర్‌టేక్‌ చేశాడు. ఓవర్‌టేక్‌ చేసి స్కూటీ ముందు ఆపాడు. కారు దిగి పిల్లల ముందే ఆమె ముక్కుపై పిడిగుద్దులు గుద్దాడు. రక్తం వచ్చేలా కొట్టాడు. ఈ సంఘటనను వివరిస్తూ ఆమె వీడియో తీశారు. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) పెట్టారు. సైడ్‌ ఇవ్వలేదని ఆరోపిస్తూ తనపై అతడు దాడి చేశాడని ఆ వీడియోలో జర్నిల్ తెలిపారు. అతడితో పాటు కారులో మరో వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పారు. పూణెలో మహిళలకు భద్రత ఎక్కడుందని పశ్నించారు, పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుండటంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. పోలీసులు వెంటనే జర్నిల్‌ ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన నిందితుడితోపాటు ఆ సమయంలో కారులో అతని భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story