చనిపోయిన మనిషి బ్రతికి లేచి రావడం ఎప్పుడైనా చూసారా? పురాణాల్లో తప్ప ఇది నిజంగా ఎలా సాధ్యం అనుకుంటున్నారా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. పాము కాటుతో చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలు చేస్తుండగా లేచి పేర్చిన చితి నుంచి బైటకి వచ్చి అందరిని ఆర్చర్య పరిచాడు. ఈ ఘటన కర్ణాటక(Karnataka) లోని గడగ్(Gadag) జిల్లా హీరేకొప్ప గ్రామంలో జరిగింది.

చనిపోయిన మనిషి బ్రతికి లేచి రావడం ఎప్పుడైనా చూసారా? పురాణాల్లో తప్ప ఇది నిజంగా ఎలా సాధ్యం అనుకుంటున్నారా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.

పాము కాటుతో చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలు చేస్తుండగా లేచి పేర్చిన చితి నుంచి బైటకి వచ్చి అందరిని ఆర్చర్య పరిచాడు. ఈ ఘటన కర్ణాటక(Karnataka) లోని గడగ్(Gadag) జిల్లా హీరేకొప్ప గ్రామంలో జరిగింది.

ఓ ఇంట్లో దూరిన పాముని తాగిన మైకంలో సిద్దప్ప బల్గనూరు అనే వ్యక్తి చేత్తో పట్టుకున్నాడు, దాన్ని ఆడిస్తుండగా అదికాస్తా కాటేసింది. స్థానికులు వెంటనే సిద్దప్పని హుబ్లీ లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం అయిందని, ఒంటి నిండా విషం చేరుకొని సిద్దప్ప మరణించాడని వైద్యులు చెప్పారు.

చనిపోయిన సిద్దప్ప అంతిమక్రియలు చేస్తుండగా సడన్ గా సిద్దప్ప లేచి కూర్చున్నాడు. దీంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు గ్రామస్తులు. షాక్ నుంచి తేరుకోగానే సిద్దప్పని మళ్ళి ఆసుపత్రికి తరలించారు. చనిపోయాడు అని డాక్టరలు డిక్లేర్ చేసిన వ్యక్తి కొన్ని గంటల్లో లేచి రావడం పట్ల స్థానికులు ఆర్చర్య పడుతున్నారు.

Updated On 4 July 2023 1:12 AM GMT
Ehatv

Ehatv

Next Story