భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) బుధవారం నోటీసులు జారీ చేసింది.

భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) బుధవారం నోటీసులు జారీ చేసింది. తన చిరునామా సమాచారం ఇవ్వనందున ఆమెకు ఈ నోటీసు జారీ చేయబడింది. ఈ విషయమై వినేష్‌ను 14 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నాడా కోరింది. నాడా నోటీసులో వినేష్‌కు త‌న‌ ఆచూకీ గురించి త‌మ‌కు స్పష్టంగా తెలియజేయలేదని తెలిపింది.

వినేష్ సెప్టెంబర్ 9న సోనిపట్‌లోని ఖర్ఖోడా గ్రామంలోని తన ఇంట్లో డోప్ పరీక్షకు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. అయితే నాడా బృందం వినేష్ చిరునామాకు చేరుకోగా నిర్ణీత సమయం, తేదీకి ఆమె అక్కడ లేదు. NADA దీనిని ఉల్లంఘనగా పరిగణించింది. దీంతో ఆమె నుండి సమాధానం కోరింది. NADAలో నమోదు చేసుకున్న ఆటగాళ్లందరూ డోప్ పరీక్ష కోసం వారి చిరునామా గురించి సమాచారాన్ని అందించాలి.

వినేష్ తన పారిస్ ఒలింపిక్ ఫైన‌ల్‌లో అధిక బ‌రువు కార‌ణం నిష్కృమించిన త‌ర్వాత రెజ్లింగ్‌ నుంచి రిటైర్మెంట్ ప్రకటించింది. ఆ త‌ర్వాత‌ వినేష్, బజరంగ్ పునియా ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్‌కు కాంగ్రెస్ టిక్కెట్టు ఇవ్వడంతో ఆమె జులనా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story