మనసులు కలిసిన తర్వాత మనువాడటానికి రైలేతేనేమీ? బస్సైతేనేమీ? ఓ యువ జంట(Young Couple) ఇలాగే అనుకున్నారు. కదులుతున్న రైలులో(Moving Train) ప్రయాణికుల(Passengers) సమక్షంలో వివాహం చేసుకుంది.

మనసులు కలిసిన తర్వాత మనువాడటానికి రైలేతేనేమీ? బస్సైతేనేమీ? ఓ యువ జంట(Young Couple) ఇలాగే అనుకున్నారు. కదులుతున్న రైలులో(Moving Train) ప్రయాణికుల(Passengers) సమక్షంలో వివాహం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో(Social media) వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువ జంట ఏదో చర్చిస్తూ కనిపిస్తుంది. ప్రియుడికి ప్రియురాలు ఏదో చెబుతూ ఉంటుంది. తర్వాత అతడు ఆమె మెడలో మూడు ముళ్లు వేస్తాడు. తర్వాత ఇద్దరూ దండలు మార్చుకుంటారు. రైల్లో ఉన్న తోటి ప్రయాణికులంతా ఈ పెళ్లితంతును చూస్తుంటారు. కొందరు ఆ దృశ్యాలను ఫోన్‌లో బంధించారు. సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇది కాస్తా వైరల్‌ అయ్యింది. చూసిన నెటిజన్లు తలోతీరుగా మాట్లాడుతున్నారు.

Updated On 3 Dec 2023 5:07 AM GMT
Ehatv

Ehatv

Next Story