కర్నాటకలో(Karnataka) ఓ కోడలు మృగంలా ప్రవర్తించింది. అతని వయసుకైనా గౌరవం ఇవ్వకుండా ఇష్టారీతిన ప్రవర్తించింది. అతడి చేతి కర్ర లాక్కొని 87 ఏళ్ల వృద్ధుడిని చితకబాదడం కలిచివేసింది. ఈ ఘటనపై వృద్ధుడి కూతురి ఫిర్యాదుచేయడంతో ఆ క్రూర కోడలిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

కర్నాటకలో(Karnataka) ఓ కోడలు మృగంలా ప్రవర్తించింది. అతని వయసుకైనా గౌరవం ఇవ్వకుండా ఇష్టారీతిన ప్రవర్తించింది. అతడి చేతి కర్ర లాక్కొని 87 ఏళ్ల వృద్ధుడిని చితకబాదడం కలిచివేసింది. ఈ ఘటనపై వృద్ధుడి కూతురి ఫిర్యాదుచేయడంతో ఆ క్రూర కోడలిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

మంగ‌ళూరుకు(Mangalore) చెందిన ప‌ద్మ‌నాభ సువ‌ర్ణ‌(87) అనే వృద్ధుడు కుల్‌శేఖ‌ర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అయితే అతని కోడ‌లు ఉమా శంక‌రి పద్మనాభ దాడి చేసింది. చేతి క‌ర్ర‌తో విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టింది. ఈ ఘటన మార్చి9న జరగడంతో ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చింది. ఆమె దాడి దృశ్యాలు దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావడంతో ఉమాశంకరి ప్రవర్తనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా ఈ ఘటనపై వృద్ధుడి కూతురు ఫిర్యాదు చేయడంతో ఉమా శంకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమా శంకరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పద్మనాభ కూతురు పోలీసులను కోరింది. మరోవైపు గాయాలపాలైన పద్మానాభ సువర్ణను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఉమా శంకరి అట్టవార్‌లోని ఎలక్ట్రిసిటీ ప్రొవైడర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.

Updated On 12 March 2024 12:35 AM GMT
Ehatv

Ehatv

Next Story