పడుకోడానికి మరెక్కడా చోటు లేదన్నట్టుగా ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌(Railyway track) మీదనే ఆదమరిచి నిద్రపోయాడు.

పడుకోడానికి మరెక్కడా చోటు లేదన్నట్టుగా ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌(Railyway track) మీదనే ఆదమరిచి నిద్రపోయాడు. అది కూడా గొడుగు వేసుకుని..! చిత్రమైనే మనిషే! ఆత్మహత్య చేసుకోవడానికే అలా పడుకున్నాడా అంటే అదేం కాదు.. ఈ విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) జరిగింది. రైల్వే ట్రాక్‌పై గొడుగు వేసుకుని గుర్రుపెట్టి నిద్రపోయాడో వ్యక్తి! ప్రయాగ్‌రాజ్‌ రైల్వే ట్రాక్‌పై(Prayagraj Railway track) ఈ ఇన్సిడెంట్‌ జరిగింది. అతడికి భూమ్మీద ఇంకా నూకలు మిగిలి ఉన్నాయి కాబట్టే లోకో పైలెట్‌ ట్రాక్‌పై పడుకున్న విషయాన్ని గమనించాడు. రైలును ఆపేసి అతడిని నిద్రలేని గట్టిగా నాలుగు తిట్లు తిట్టి అక్కడ్నుంచి పంపించాడు.



Updated On 25 Aug 2024 11:02 AM GMT
Eha Tv

Eha Tv

Next Story