కట్టుకున్న భార్యను బైక్‌కు కట్టేసి ఈడ్చుకెళ్లిన శాడిస్టు భర్త

రాజస్తాన్‌లోని(Rajasthan) నాగౌర్‌ జిల్లాలో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరిని కదిలించింది. మనిషి జన్మ ఎత్తినందుకు సిగ్గుపడేలా చేసింది. ఓ యువకుడు సొంత భార్యను(Wife) తాళ్లతో కట్టేసి బైలక్‌పై(Bike) లాగుతూ తీసుకెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో(Social media) వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదు. నెల రోజుల కిందట నహర్‌సింగ్‌ పురాలో జరిగింది. ఇప్పుడు వైరల్ అవుతుండటంతో పోలీసులు యాక్షన్‌లోకి దిగారు. ప్రస్తుతం బాధితురాలు జైసల్మేర్‌లో తన సోదరి ఇంట్లో ఉంటున్నది. నిందితుడు ప్రేమ్‌రామ్‌ మేఘవాల్‌గా గుర్తించామని పోలీసులు చెప్పారు. బీహార్‌లో(Bihar) ఉంటున్న ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని కొద్ది రోజుల కిందట ప్రేమ్‌రామ్‌ పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తల్లిదండ్రులకు బాగానే ముట్టచెప్పాడు. పెళ్లయ్యాక తన భార్యను నహర్‌సింగ్‌పురాకు తీసుకొచ్చాడు. ఆలుమగల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవని చుట్టుపక్కల వాళ్లు చెప్పారు. నెల రోజుల కిందట పెద్దగొడవ జరిగిందని, నిందితుడు భార్యను తాళ్లతో కట్టేసి బైక్‌పై ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశాడని పోలీసులు చెప్పారు. నిందితుడి ఫ్రెండ్‌ ఒకడు ఈ ఘటనను వీడియో తీశాడు. ఈ ఘటన తర్వాత భార్యను ఇంటినుంచి గెంటేశాడు. చేసేదేమీ లేక పాపం ఆ అమ్మాయి జైసల్మేర్‌లో ఉంటున్న తన సోదరి దగ్గరకు వెళ్లింది. రెండు రోజుల కిందట నిందితుడు తన ఫ్రెండ్‌తో కలిసి మందు తాగాడు. మద్యం సేవిస్తున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో ఆ ఫ్రెండ్‌ ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. కాసేపటికే వైరల్‌ అయిన ఈ వీడియో పోలీసుల కంట పడింది. వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్‌ చేశారు. అయితే ఇప్పటి వరకు బాధితురాలు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. నిందితుడి భార్య, అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story