కేరళలో(Kerala) స్వాతంత్ర్య దినోత్సవం రోజున(Independence day) ఓ అద్భుతం చోటు చేసుకుంది.

కేరళలో(Kerala) స్వాతంత్ర్య దినోత్సవం రోజున(Independence day) ఓ అద్భుతం చోటు చేసుకుంది. ఓ స్కూల్లో పిల్లలు, టీచర్లు కలిసి జెండా వందనంలో పాల్గొన్నారు. మువ్వన్నెల జెండాను ఎగరేశారు. అయితే జెండా పైకి వెళ్లిన తర్వాత తెరచుకోలేదు. పాపం పిల్లలు డీలా పడ్డారు. అంతలో ఎక్కడ్నుంచి వచ్చింఓద ఏమో కానీ ఓ పక్షి(Bird) రెపరెపలాడుకుంటూ వచ్చి ముడుచుకున్న జెండాను ముక్కుతో విప్పేసి మళ్లీ ఎరుగుకుంటూ వెళ్లిపోయింది. జెండా రెపరెపలాడింది. పిల్లలపై పూల వర్షం కురిసింది. ఈ వీడియోను ఓ నెటిజన్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు చేశారు. సోషల్‌ మీడియాలో ఇది చక్కర్లు కొడుతోంది. గాడ్స్‌ ఓన్‌ కంట్రీ కదా అక్కడ ఇలాగే జరుగుతుందని ఒకరు కామెంట్‌ చేస్తే, గత జన్మలో ఆ పక్షి దేశం కోసం ప్రాణాలు విడిచిన అమరవీరుడేమోనని మరొకరు వ్యాఖ్యానించారు.



Updated On 17 Aug 2024 9:15 AM GMT
Eha Tv

Eha Tv

Next Story