ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు ఇంకా ప్రమాదంలోనే ఉన్నాయి. గత 10 రోజులుగా 41 మంది కూలీలు బయటకు రావాలని ఆశతో సొరంగం లోపల కూర్చున్నారు.

ఉత్తరకాశీ(Uttarkashi)లోని సిల్క్యారా టన్నెల్ ప్రమాదం(Tunnel Collapse)లో 41 మంది ప్రాణాలు ఇంకా ప్రమాదంలోనే ఉన్నాయి. గత 10 రోజులుగా 41 మంది కూలీలు బయటకు రావాలని ఆశతో సొరంగం లోపల కూర్చున్నారు. 10 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కూడా యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల ఛాయాచిత్రాలు, వీడియోల మంగళవారం ఉదయం బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్రచారానికి సంబంధించి మ‌రో న్యూస్ బయటకు వస్తోంది.

నేడు 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్(Rescue Operation) కొనసాగుతోంది. దేశంలోని నలుమూలల నుండి యంత్రాలు తీసుకువ‌చ్చారు. ఉత్తరకాశీలో పగలు, రాత్రి డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయి. సిల్క్యారా సొరంగం(Silkyara Tunnel)లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ఆగర్ యంత్రాన్ని రాత్రిపూట ఆపరేట్ చేశారు. బుధవారం తెల్లవారుజామున దాదాపు 32 మీటర్ల మేర 800 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన పైపులు శిథిలాలలోకి చేరాయి. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయం బయటకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

రెస్క్యూ ఆపరేషన్ ఊపందుకుంది. అధికార యంత్రాంగం ఇతర సన్నాహాలు కూడా ప్రారంభించింది. కార్మికులను ఆసుపత్రికి తరలించేందుకు తగిన అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం తెహ్రీ, ఇతర జిల్లాల నుండి కూడా అంబులెన్స్‌లను పిలిపించారు. బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయం వరకు కార్మికులను రక్షించవచ్చని భావిస్తున్నారు.

సొరంగం చుట్టూ జిల్లా యంత్రాంగం, పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సొరంగం లోపలికి వెళ్లే కార్మికులు, ఉద్యోగుల ఫోన్లను కూడా టన్నెల్ గేటు వద్దే సేకరిస్తున్నారు.

సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు నిర్వహిస్తున్న ఆపరేషన్‌లో వైమానిక దళం కూడా సహకరిస్తోంది. అన్ని రంగాల‌ను సహాయక చర్యలలో నిమ‌గ్నం చేశారు. ఎయిర్ ఫోర్స్ కార్గో విమానాలు యంత్రాలను టన్నెల్ వ‌ద్ద‌కు రవాణా చేయడంలో సహాయకరంగా ఉన్నాయి. మంగళవారం వైమానిక దళం వివిధ ఆధునిక మెకానికల్ పరికరాలను.. 18 టన్నుల బరువున్న 24 ప్రత్యేక స్పైరల్ వెల్డెడ్ పైపులను రూర్కెలా, బెంగుళూరు నుండి తరలించాయి.

Updated On 21 Nov 2023 11:04 PM GMT
Yagnik

Yagnik

Next Story