ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) రాష్ట్ర మంత్రి సంజయ్‌ సింగ్‌ గాంగ్వార్‌(Sanjay Singh Gangwar) ఓ కొత్త విషయాన్ని చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) రాష్ట్ర మంత్రి సంజయ్‌ సింగ్‌ గాంగ్వార్‌(Sanjay Singh Gangwar) ఓ కొత్త విషయాన్ని చెప్పారు. ఆయన చెప్పింది విని జనం ముక్కున వేలేసుకున్నారు. కేన్సర్‌(Cancer) పేషంట్లు గోశాలలో(Cow shed) ఉంటూ, వాటిని శుభ్రం చేస్తూ ఉంటే రోగం తగ్గిపోతుందని సంజయ్‌ సింగ్‌ చెప్పుకొచ్చారు. ఆదివారం గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చాలా విషయాలు చెప్పారు. గోశాలలో ఉంటూ గోవులకు సేవ చేస్తూ బీపీ తగ్గిపోతుందన్నారు. మందులు వాడే అవసరమే ఉండదన్నారు. ప్రజలు తమ వివాహ వార్షికోత్సవాలు, తమ పిల్లల పుట్టినరోజు వేడుకలను గోశాలల్లో జరుపుకోవాలని ఆయన పిలుపు కూడా ఇచ్చారు. కేన్సర్‌ పేషంట్లు గోశాలలను శుభ్రం చేస్తూ అక్కడే ఉంటే స్వస్థత చేకూరుతుందని అన్నారు. ఆవు పేడతో తయారు చేసిన పిడకలు కాలిస్తే దోమలు దూరమవుతాయని సంజయ్‌సింగ్‌ గాంగ్వార్‌ పేర్కొన్నారు.

Eha Tv

Eha Tv

Next Story