అక్కడ కొన్ఇన గ్రామాలలో హిందూ-ముస్లింలు కలిసి మెలిసి ఉంటారు. పండుగలు పబ్బాలు కలిసి జరుపుకుంటారు.

మత విద్వేషాలను వాట్సప్‌ యూనివర్సిటీ రోజుకో చెత్తతో వైరల్ చేస్తున్న ఈ కాలంలో, మతం పేరుతో కొట్టుకుచస్తున్న ఈ సమయంలో అలాంటి మతమౌఢ్యం ఉన్నవారు మహారాష్ట్రలోని(Maharashtra) కొల్హాపూర్‌(Kollapur), సాంగ్లీ జిల్లాలకు ఓ సారి వెళ్లి వస్తే బాటుంటుంది. అక్కడ కొన్ఇన గ్రామాలలో హిందూ-ముస్లింలు కలిసి మెలిసి ఉంటారు. పండుగలు పబ్బాలు కలిసి జరుపుకుంటారు. ఇక్కడి కొన్ని మసీదులలో(Mosques) నాలుగు దశాబ్దాలకు పైగా వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తూ వస్తున్నారు. 1982లో ప్రారంభమైన ఈ సత్సంప్రదాయాన్ని ప్రస్తుత తరం ముందుకు తీసుకెళుతుంది. సాంగ్లీ జిల్లా వాల్వా తాలూకాలో గోటిఖిండీ అనే గ్రామం పది మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ ఉన్న జుజర్‌ ఖోలో ఉన్న మసీదులో ప్రతి సంవత్సరం పది రోజుల పాటు న్యూ గణేశ్‌ మండలివారు(New ganesh mandali) వినాయకుడిని ప్రతిష్టిస్తారు. వినాయకుడిని దర్శించుకోవడానికి ముస్లింలు(Muslim) కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

ఇంత మంచి సంప్రదాయం ఎలా మొదలయ్యిందంటే, ఒకసారి గ్రామంలోని చౌరస్తా దగ్గర మండపం ఏర్పాటు చేయకుండానే వినాయకుడి విగ్రహం పెట్టారు. ఓ రోజు పెద్ద వర్షం పడి వినాయకుడి విగ్రహం తడిచిపోయింది. గ్రామానికి చెందిన ఒక ముస్లిం వ్యక్తి అది చూసి గణేశ్‌ మండలికి చెందిన భక్తులకు చెప్పారు. అప్పుడే నిజామ్‌ పఠాన్‌(Nizam Patan) అనే ఆయన వర్షంలో పూర్తిగా తడిచిపోయిన వినాయకుడి విగ్రహాన్ని దగ్గరలోని మసీదులో ఉంచాలని కోరారు. గణేశ్‌ మండలివారు కూడా సంతోషంతో ఒప్పుకున్నారు. గణపతి విగ్రహాన్ని సమీపంలోని మసీదులో ఉంచారు. నిమజ్జనం వరకు ఆ ఏడాది వినాయకుడిని ఆ మసీదులోనే ఉంచి పూజలు చేశారు. 1961లో గోటిఖిండీ గ్రామంలో గణేశ్‌ ఉత్సవాలను మొదలుపెట్టిన బృందంలో అశోక్‌ పాటిల్‌ తండ్రి కూడా సభ్యుడు. 1986లో ఇదే గ్రామానికి చెందిన కొందరు యువకులు పొరుగున ఉన్న బావ్చీ గ్రామంలో గణేశ్‌ ఉత్సవాల కార్యక్రమాన్ని చూడటానికి వెళ్లారు. హిందూ, ముస్లిం వర్గాలకు చెందినవారు ఆ కార్యక్రమంలో కలిసి పాల్గొనడాన్ని వారు గమనించారు. వారి స్ఫూర్తితో గ్రామంలోని మసీదులో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మొదలుపెట్టారు. 1961లో గణపతి ఉత్సవాలను జరిపిన వారి తరవాత రెండో తరం వారు 1986లో గణేశ్‌ ఉత్సవాలను నిర్వహించారు. ఇప్పుడు మూడో తరం వారు కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అప్పుడప్పుడు గణపతి పండుగ సమయంలోనే బక్రీద్‌ పండుగ కూడా వస్తుండేది. ఆ సమయంలో ముస్లింలు మేకలను కోయడం, ఖుర్బానీ చేయడం వంటివి నిలిపివేసేవారు. వినాయకుడి నిమజ్జన కార్యక్రమం తర్వాత ఊరంతా కలిసి భోజనాలు చేస్తారు. ఊళ్లోని పురుషులు, మహిళలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ప్రతి రోజూ ఒకో కుటుంబం హారతి సేవలో పాల్గొంటుంది. రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు హారతి ఇస్తారు. కొల్హాపూర్‌ జిల్లాలోని కురుంద్‌ వాడ్‌లోని అయిదు మసీదుల్లో వినాయక మండపాలను ఏర్పాటు చేశారు. గ్రామంలోని కుదేంఖా బడేనల్‌ సాహేబ్‌ మసీదు, ఢపణపూర్‌ మసీదు, బైరాగ్దార్‌ మసీదు, శెలే మసీదు, కరకన్యా మసీదులలో వినాయకుడిని పెట్టారు. 1982 తర్వాతి ఏడాది నుంచి గ్రామంలోని అయిదు మసీదుల్లో గణపతి మండపాలను ఏర్పాటు చేయడం మొదలైంది. 2018, 2019, 2020లలో గణపతి ఉత్సవాలు, మొహర్రం కలిసి వచ్చాయి. వీటిని ప్రజలందరూ కలిసిమెలిసి జరుపుకున్నారు. ఆ సమయంలో వినాయకుని మోదకాలు, పీరీలలో పంచే చోంగ్యా ప్రసాదం రెండూ కలిపి ప్రజలకు పంపిణీ చేశారు.

Eha Tv

Eha Tv

Next Story