కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు(Central Government Employees) నాలుగు శాతం డీఏ(DA) పెంచేశారు. ఆ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్(Union Cabinet) ఆమోదం తెలిపింది. జూలై 1, 2023 నుంచి పెరిగిన డీఏ అమలులోకి రానుంది. ప్రస్తుతం ఉద్యోగులకు డీఏ రేటు 42 శాతంగా ఉంది. 4 శాతం పెరిగితే, అప్పుడు ఇకపై 46 శాతం డీఏ అందుకోనున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు(Central Government Employees) నాలుగు శాతం డీఏ(DA) పెంచేశారు. ఆ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్(Union Cabinet) ఆమోదం తెలిపింది. జూలై 1, 2023 నుంచి పెరిగిన డీఏ అమలులోకి రానుంది. ప్రస్తుతం ఉద్యోగులకు డీఏ రేటు 42 శాతంగా ఉంది. 4 శాతం పెరిగితే, అప్పుడు ఇకపై 46 శాతం డీఏ అందుకోనున్నారు.
కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం (డిఎ)ని నాలుగు శాతం పాయింట్లు పెంచి, ప్రస్తుతం ఉన్న 42% నుండి 46%కి పెంచడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అక్టోబర్ 18, 2023న తెలిపారు. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు సమానమైన బోనస్గా 78 రోజుల జీతాన్ని అందించడానికి కూడా ఆమోదించింది. దీంతో 11.07 లక్షల మంది ఉద్యోగులు లబ్ది పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం, కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 42% డియర్నెస్ అలవెన్స్ పొందుతున్నారు.