తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రకటన చేసినప్పటి నుండి.. బీజేపీతో సహా హిందూ మత పెద్దలందరికీ లక్ష్యంగా మారాడు.

తమిళనాడు(Tamil Nadu) మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రకటన చేసినప్పటి నుండి.. బీజేపీ(BJP)తో సహా హిందూ మత పెద్దలందరికీ లక్ష్యంగా మారాడు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆయనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి, ప్రజలు ఆయ‌న దిష్టిబొమ్మల‌ను కూడా దహనం చేస్తున్నారు. వివాదాల నేప‌థ్యంలో.. తన మాటకు కట్టుబడి ఉంటానని ఉదయనిధి అన్నారు. కొన్ని ఆచారాలను రూపుమాపాలని తాను అలా మాట్లాడానని.. వాటికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తూనే ఉంటానని ఉదయనిధి స్టాలిన్ మరోసారి చెప్పారు.

తాను హిందువుల విశ్వాసం గురించి మాత్రమే కాకుండా దానిని ఆచరించే వారందరి గురించి మాట్లాడానని అన్నారు. తాను కుల వివక్షను మాత్రమే ఖండించానని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. శనివారం నాడు నేను మాట్లాడిన విషయంపై పదేపదే కార్యక్రమాల‌లో మాట్లాడతాను. చాలా మందిని ఇబ్బంది పెట్టే ఒక సమస్యపై మాట్లాడబోతున్నానని ఆ రోజే చెప్పాను.. అదే జరిగిందని అన్నారు.

నిన్నగాక మొన్న ఓ ఫంక్షన్‌లో సనాతన ధర్మం గురించి మాట్లాడాను అని అన్నారు. నేనేం చెప్పానో, అదే పదే పదే చెబుతాను. నేను హిందూ మతాన్నే కాదు అన్ని మతాలను చేర్చాను. కుల భేదాలను ఖండించాను. సనాతన ధర్మం అంటే అది శాశ్వతమని, దానిని మార్చలేమని ఆయన పేర్కొన్నారు.

ఇంతకుముందు మహిళలు ఇంటికే పరిమితమయ్యారని, అయితే వారు బయటకు వచ్చేశారని మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. మహిళలు విద్యను పొందలేరని.. ద్రవిడమ్ (డీఎంకే సిద్ధాంతం) మాత్రమే వారికి విద్యను అందించిందని అన్నారు. అల్పాహార పథకం (తమిళనాడులో) కూడా ఎక్కువ మంది పిల్లలు, ముఖ్యంగా బాలికలు విద్యనభ్యసించేలా చేయడం కోసం ఉద్దేశించబడిన‌ద‌ని అన్నారు.

సనాతనం స్త్రీలను బానిసలుగా మార్చింది. ఒకప్పుడు వితంతువులు తమ భర్తల అంత్యక్రియల చితిలో దూకి ఆత్మహత్య చేసుకునే సతి ఆచారం ఉంది. ఇవన్నీ శాశ్వతమైనవని అన్నారు. దీనికి ముగింపు పలకాలని నేను పట్టుబట్టాను. అలా చెబుతూనే ఉంటాను. ఈ విషయంలో తనకు ప్రాణహాని వచ్చినా పట్టించుకోన‌న్నారు. విపక్షాల ఐక్యత పెరుగుతుందనే భయంతో బీజేపీ తన మాటలను వక్రీకరించిందని ఆరోపించారు.

Updated On 4 Sep 2023 7:55 PM GMT
Yagnik

Yagnik

Next Story