కర్నాటక(Karnataka) రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని ముండేగోడ(Mundegoda) ప్రాంతంలో తోపన్న అనే వ్యక్తి తన భార్య శాంత అనే మహిళతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు. తోపన్న ప్రతిరోజూ మద్యం తాగి సంసార సుఖం ఇవ్వకపోవడంతో భార్య శాంత కూడా పక్కదారి పట్టింది. ఈ క్రమంలోనే ఓ ప్రియుడిని సెట్ చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త తోపన్న మరింత ఎక్కువగా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యపై చేయిచేసుకునేవాడు.

కర్నాటక(Karnataka) రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని ముండేగోడ(Mundegoda) ప్రాంతంలో తోపన్న అనే వ్యక్తి తన భార్య శాంత అనే మహిళతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు. తోపన్న ప్రతిరోజూ మద్యం తాగి సంసార సుఖం ఇవ్వకపోవడంతో భార్య శాంత కూడా పక్కదారి పట్టింది. ఈ క్రమంలోనే ఓ ప్రియుడిని సెట్ చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త తోపన్న మరింత ఎక్కువగా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యపై చేయిచేసుకునేవాడు. దీంతో భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని చూసింది. భర్తను మట్టుపెడితే ప్రియుడితో ఎంజాయ్‌ చేయొచ్చని ప్లాన్‌ వేసింది.

ఈ క్రమంలోనే 15 రోజుల క్రితం ఎప్పటిలాగే భర్త గొంతు వరకు మద్యం సేవించి(Drunk) ఇంటికి వచ్చాడు. తాగిన మత్తులో పడుకొని ఉన్న భర్త మర్మంగాన్ని నలిపి నలిపి హత్య చేసింది. ఇక ఎవరికీ అనుమానం రాకుండా ఓ కథను అల్లుకుంది. తాగిన మైకంలో ఇంటికి వచ్చిన తన భర్త తోపన్న కిందపడి చనిపోయాడని కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులకు శాంతా కథను వండివార్చింది. తోపన్న మద్యానికి బానిస కావడం, ప్రతిరోజు విపరీతంగా మద్యం సేవించడంతో అతని కుటుంబ సభ్యులు, స్థానికులు కూడా కిందపడి సహజంగానే మృతి చెంది ఉండొచ్చని భావించారు.ఆ కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి తోపన్న అంత్యక్రియలను పూర్తి చేశారు. భర్తను హత్య చేసిన తర్వాత.. ఇక తనకు అడ్డు ఎవరులేరని భావించింది శాంత. రెండు వారాల తర్వాత అసలు విషయం బయటపడింది. ఎప్పటిలాగే తన ప్రియుడితో మాట్లాడుతూ "నా మొగుడి మర్మాంగం పూర్తిగా నలిపేసి హత్య చేశానని, అయితే అందరూ అతనిది సహజ మరణం అని అనుకుంటున్నారని, నేను కేసు నుంచి తప్పించుకున్నానని ప్రియుడితో మాట్లాడుతూ నోరుజారింది శాంత. అయితే అవతలివైపు ప్రియుడు ఫోన్‌ స్పీకర్‌ ఆన్‌లో ఉండడంతో అతని పక్కనే ఉన్నవారు కూడా శాంత మాటలను విన్నారు. దీంతో వారి కులసంఘ పెద్దలు పిలిచి విచారించగా అసలు నిజం బయటపడింది. తన భర్తను తానే చంపానని అందరి ముందు ఒప్పుకుంది. తన భర్త తోపన్న మర్మాంగం గట్టిగా నులిమేసి అతని మర్మాంగం మీద దాడి చేసి మంచం మీదనే అతన్ని హత్య చేసినట్లు అంగీకరించింది. ఈ ఘటనపై ముండగోడ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలు శాంతాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated On 20 March 2024 1:26 AM GMT
Ehatv

Ehatv

Next Story