వివాహేతర సంబంధాల(Extra Marrital Affair) గురించి రోజూ వార్తలు చూస్తూనే ఉంటాం. తమ సుఖాల కోసం, వివాహేతర సంబంధాల పెట్టుకోవడమే కాకుండా తమ భాగస్వామ్యులను చంపడం లేదా చంపించారన్న ఘటనలు అను నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి తమిళనాడులోని తిరువళ్లూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వివాహేతర సంబంధాల(Extra Marrital Affair) గురించి రోజూ వార్తలు చూస్తూనే ఉంటాం. తమ సుఖాల కోసం, వివాహేతర సంబంధాల పెట్టుకోవడమే కాకుండా తమ భాగస్వామ్యులను చంపడం లేదా చంపించారన్న ఘటనలు అను నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి తమిళనాడులోని తిరువళ్లూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తిరువళ్లూరు(Tiruvallur) జిల్లా మనవాలనగర్‌లో సెంథిల్‌రాజ్‌(Senthilraj) (38), భార్య తామరసెల్వితో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో సెంథిల్‌రాజ్‌కు కిళానూర్‌ అనే గ్రామంలో ఉంటున్న మదన్‌ భార్య నిత్య(Nithya) (34)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి వ్యవహారం సెంథిల్‌రాజ్‌ భార్య తామరసెల్వికి(Thamaraselvi) తెలిసింది. తన భర్తతో వివాహేతర సంబంధాన్ని వదులుకోవాలని పలుసార్లు భర్తను బతిమలాడింది. భర్త వ్యవహారంలో ఏ మాత్రం మార్పు కనిపించకపోవడంతో.. విసిగిచెంది డైరెక్ట్ నిత్యకే ఫోన్‌ చేసి తన భర్తతో వివాహేతర సంబంధాన్ని వదులుకోవాలని కోరింది. తన కాపురాన్ని కూల్చివేయొద్దని నిత్యకు విజ్ఞప్తి చేసింది. ఇందుకు నిత్య ఒప్పుకోలేదు. అంతేకాకుండా సెంథిల్‌రాజ్‌తో దిగిన ఫొటోలను సామాజిక మధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు వైరల్‌గా మారయి. దీంతో ఆగ్రహించిన సెంథిల్‌రాజ్ భార్య తామరసెల్వి మరోసారి నిత్యకు ఫోన్‌ చేసి వాగ్వాదం పెట్టుకుంది. ఇది తట్టుకోలేని నిత్య, తన బంధువలు వినోద్(Vinodh), గణేష్‌ను(Ganesh) వెంటపెట్టుకొని వచ్చి తామరసెల్విని చితకబాదారు. అంతేకాకుండా ఆమె బైక్‌ను ధ్వంసం చేశారు. దాడిలో తామరసెల్వికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో పోలీసులకు తామరసెల్లి ఫిర్యాదు చేయడంతో నిత్య సహా ముగ్గురిపై పోలీసులు కేసు రిజిస్టర్‌ చేశారు.

Updated On 18 Nov 2023 5:14 AM GMT
Ehatv

Ehatv

Next Story