ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh) నుంచి పార్లమెంట్ ఎన్నికల(Parliament Election) బరిలో తెలంగాణకు చెందిన మహిళ పోటీ చేస్తున్నారు. జౌన్‌పుర్(Jaunpur) లోక్‌సభ స్థానం నుంచి తెలంగాణకు చెందిన శ్రీకళారెడ్డి(Srikala Reddy) బరిలోకి దిగారు. శ్రీ కళారెడ్డికి బహుజన్ సమాజ్ పార్టీ (BSP) లోక్‌సభ టికెట్ ఇచ్చింది. శ్రీకళారెడ్డి పుట్టింది తెలంగాణ అయినా.. మెట్టినిల్లు మాత్రం ఉత్తరప్రదేశ్‌ కావడంతో ఆమె అక్కడి నుంచి పోటీ చేస్తోంది. ఆమె భర్త ధనుంజయ్ సింగ్(Dhanunjay Singh) జౌన్‌పుర్ మాజీ ఎంపీ. బీఎస్పీ అధినేత్రి మాయావతికి సన్నిహితుడిగా ఆయనకు పేరుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh) నుంచి పార్లమెంట్ ఎన్నికల(Parliament Election) బరిలో తెలంగాణకు చెందిన మహిళ పోటీ చేస్తున్నారు. జౌన్‌పుర్(Jaunpur) లోక్‌సభ స్థానం నుంచి తెలంగాణకు చెందిన శ్రీకళారెడ్డి(Srikala Reddy) బరిలోకి దిగారు. శ్రీ కళారెడ్డికి బహుజన్ సమాజ్ పార్టీ (BSP) లోక్‌సభ టికెట్ ఇచ్చింది. శ్రీకళారెడ్డి పుట్టింది తెలంగాణ అయినా.. మెట్టినిల్లు మాత్రం ఉత్తరప్రదేశ్‌ కావడంతో ఆమె అక్కడి నుంచి పోటీ చేస్తోంది. ఆమె భర్త ధనుంజయ్ సింగ్(Dhanunjay Singh) జౌన్‌పుర్ మాజీ ఎంపీ. బీఎస్పీ అధినేత్రి మాయావతికి సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. అయితే కిడ్నాప్, దోపిడీ కేసులో ఆయన జైలుకు వెళ్లడం వల్ల ఎన్నికల్లో పోటీ చేయకుండా కోర్టు ధనుంజయ్‌పై నిషేదం విధించింది. దీంతో జౌన్‌పుర్ లోక్‌సభ టికెట్‌ను ధనంజయ్ సింగ్ భార్య శ్రీకళారెడ్డికి బీఎస్పీ అధిష్టానం టికెట్ కేటాయించింది. మరోవైపు ఇదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కృపాశంకర్‌ సింగ్‌, ఎస్పీ అభ్యర్థిగా మాజీ మంత్రి బాబు సింగ్‌ కుష్వాహా పోటీ చేస్తుండడంతో ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది.

అయితే శ్రీకళారెడ్డి కుటుంబ నేపథ్యం చూస్తే.. ఈ కుటుంబానికి రాజకీయాలు కొత్తేమీ కాదు. సూర్యాపేట జిల్లా నడిగుడెం మండలం రత్నవరంలో శ్రీకళారెడ్డి జన్మించారు. ఆమె తండ్రి జితేందర్‌రెడ్డి నల్గొండ జిల్లా కోఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడిగా పని చేశారు. 1972లో హుజూర్ నగర్ స్థానం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో రాజకీయాలపై శ్రీకళారెడ్డికి ఆసక్తి ఏర్పడింది. 2004లో ఆమె టీడీపీలో చేరారు. ఆ సమయంలో కోదాడ టీడీపీ టికెట్‌ను ఆశించారు. ఆ తర్వాత కొన్ని రోజులు దూరంగా ఉన్నా వైసీపీలో చేరారు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్ రావుతో కలిసి బీజేపీలో చేరారు. 2019లో హుజూర్‌నగర్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. అయితే టికెట్ దక్కలేదు. ఇక ఇక్కడి రాజకీయాల నుంచి ఆమె తప్పుకున్నారు. 2021లో ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో గెలిచి జడ్పీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.

నిప్పో బ్యాటరీ గ్రూప్‌ కంపెనీ యాజమాన్యం ఈ కుటుంబమే. ఈ కంపెనీ చెన్నై కేంద్రంగా పనిచేయడంతో శ్రీకళారెడ్డి బాల్యమంతా అక్కడే గడిచింది. ఇంటర్‌ చెన్నైలో పూర్తి చేయగా.. హైదరాబాద్‌లో బీకామ్‌ పూర్తి చేశారు. తర్వాత అమెరికాకు వెళ్లి ఆర్కిటెక్చర్‌ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సు చేశారు. 2017లో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో యూపీకి చెందిన రాజకీయ నాయకుడు ధనంజయ్ సింగ్‌ను శ్రీకళారెడ్డి పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇండియాకు వచ్చి చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో ఎంతోమంది వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులతో పాటు నటుడు అల్లు అర్జున్ కూడా పాల్గొన్నారు. ధనుంజయ్‌సింగ్‌కు శ్రీకళా రెడ్డి మూడో భార్య. మొదటి భార్య చనిపోవడం, రెండోభార్య విడాకులు తీసుకోవడంతో శ్రీకళారెడ్డిని పెళ్లి చేసుకున్నారు. చాలా సంపన్నురాలిగా పేరుగావించిన శ్రీకళారెడ్డి ఈ సారి ఎన్నికల్లో గెలుస్తారా అంటే.. వెయిట్‌ చేయక తప్పదు

Updated On 18 April 2024 1:03 AM GMT
Ehatv

Ehatv

Next Story