తెలంగాణ ముఖ్యమంత్రి(telangana), పీసీసీ(PCC) చీఫ్‌ రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఇవాళ ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్‌ అధిష్టానం(Congress High command) పెద్దలతో సమావేశం అవుతారు.

తెలంగాణ ముఖ్యమంత్రి(telangana), పీసీసీ(PCC) చీఫ్‌ రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఇవాళ ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్‌ అధిష్టానం(Congress High command) పెద్దలతో సమావేశం అవుతారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో(Lok sabha Elections) పార్టీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ తదితర అంశాలపై అధినాయకత్వంతో రేవంత్‌ చర్చిస్తారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నుంచి ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. బీఆర్‌ఎస్‌(BRS) నుంచి కొత్తగా పార్టీలోకి వస్తున్నవారితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేసిన సొంత పార్టీ నేతల నుంచి ఎంపీ టికెట్ల విషయంలో ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఎంపీ టికెట్లు(MP seats) ఇవ్వలేని వారికి కార్పొరేషన్‌ పదవులను ఇచ్చి బుజ్జగించే అవకాశం ఉన్నట్టు గాంధీభవన్‌ టాక్ వినిపిస్తోంది.

Updated On 19 Feb 2024 2:20 AM GMT
Ehatv

Ehatv

Next Story