బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. నితీష్ కుమార్ కొత్త కేబినెట్‌లో ప్రస్తుతం ఆరుగురు నేతలు మంత్రులుగా, ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.

బీహార్‌(Bihar)లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. నితీష్ కుమార్(Nitish Kumar) కొత్త కేబినెట్‌లో ప్రస్తుతం ఆరుగురు నేతలు మంత్రులుగా, ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) కూడా నితీశ్‌ కుమార్‌కు అభినందనలు తెలిపారు. బీహార్ రాజ‌కీయ ప్ర‌కంప‌న‌ల త‌ర్వాత మాట‌ల యుద్ధం కూడా మొద‌లైంది. తేజస్వీ యాదవ్‌(Tejaswi Yadav) స్టేట్‌మెంట్ తో మరోసారి రాజకీయాలు ఊపందుకున్నాయి.

ముఖ్యమంత్రి తనను ఎందుకు విడిచిపెట్టారో తేజస్వి యాదవ్ చెప్పారు. ముఖ్యమంత్రి భయపడుతున్న విషయాన్ని ఆయన చెప్పారు. ఓ ముఖ్యమంత్రి 17 ఏళ్లలో చేసిన దానికంటే ఓ యువకుడు 17 నెలల్లో ఎక్కువ పని ఎలా చేశాడో అని ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు భయం మొదలైందని తేజస్వి అన్నారు.

నితీష్‌ కుమార్ మాకు ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చినా, అది చదువు అయినా, క్రీడ అయినా.. మేము బలంగా పని చేశామ‌ని అనే చర్చ ప్రజల్లో మొదలైంది. 17 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి బీజేపీతో కలిసి డబుల్ ఇంజన్(Double Engine) చేయలేనిది.. ఈ యువకుడు 17 నెలల్లో ఇంత పని ఎలా చేస్తున్నాడన్న విషయాన్ని నితీష్ కుమార్ జీర్ణించుకోలేకపోతున్నారు. మేము తీసుకువచ్చిన విజన్‌తో మేము ప్ర‌జ‌ల‌ ముందుకు వెళ్తాము. 2024లో ప్రజలే సమాధానం చెబుతారని తేజస్వి అన్నారు. వారి పార్టీ అంతం అవుతుందన్నారు.

Updated On 29 Jan 2024 12:51 AM GMT
Yagnik

Yagnik

Next Story