మన దేశంలో అభిమానానికి కొదవ లేదు. సినీ తారలను గుండెల నిండా అభిమానించే, ఆరాధించే వారు కోట్ల సంఖ్యలో ఉంటారు. అలాంటి ప్రముఖ తారలు ఏది చెప్పినా వినడానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉంటారు. ఏది చేయమన్నా తూ.చ తప్పకుండా చేస్తారు. అలా కోట్లాది మందిని ప్రభావితం చేయగలం శక్తి తారలకు ఉంది కాబట్టే, అనేక వాణిజ్య సంస్థలు తమ ప్రొడక్ట్స్(Products) గురించి వారితో ప్రచారం(Promotion) చేయిస్తున్నాయి. అందుకు పెద్ద మొత్తంలో పారితోషికం(Remuneration) కూడా చెల్లిస్తున్నాయి. దేశంలో 2007లో చిన్నా పెద్దా కంపెనీలు కలిపి సుమారు 650 ఉత్ప త్తులకు సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తే..

మన దేశంలో అభిమానానికి కొదవ లేదు. సినీ తారలను గుండెల నిండా అభిమానించే, ఆరాధించే వారు కోట్ల సంఖ్యలో ఉంటారు. అలాంటి ప్రముఖ తారలు ఏది చెప్పినా వినడానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉంటారు. ఏది చేయమన్నా తూ.చ తప్పకుండా చేస్తారు. అలా కోట్లాది మందిని ప్రభావితం చేయగలం శక్తి తారలకు ఉంది కాబట్టే, అనేక వాణిజ్య సంస్థలు తమ ప్రొడక్ట్స్(Products) గురించి వారితో ప్రచారం(Promotion) చేయిస్తున్నాయి. అందుకు పెద్ద మొత్తంలో పారితోషికం(Remuneration) కూడా చెల్లిస్తున్నాయి. దేశంలో 2007లో చిన్నా పెద్దా కంపెనీలు కలిపి సుమారు 650 ఉత్ప త్తులకు సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తే.. 2017 నాటికి వాటి సంఖ్య 1660కి చేరుకున్నట్లు ఒక వాణిజ్య సర్వే లెక్క తేల్చింది. ఆయా ప్రోడక్ట్స్ బ్రాండ్ అంబాసిడర్లకు చెల్లించిన మొత్తం కూడా రూ.1,550 కోట్ల నుంచి రూ. 6,600కు ఎగబాకినట్లు అంచనా వేసింది. ఇప్పుడా మొత్తం మరింత ఎక్కువే ఉంటుందంటున్నారు. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య సెలబ్రిటీలతో కూడిన వాణిజ్య ప్రకటనల్లో(Advertisement) 11శాతం వృద్ధి నమోదైనట్లు టోటల్ అడ్రెసబుల్ మార్కెట్ (TAM) నివేదిక తెలిపింది.
ప్రముఖ తారలు ప్రచారం చేస్తున్న ఉత్పత్తుల్లో అత్యధికం ఆహారం, పానీయాలతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత, గృహోపకరణాలు, ఆరోగ్య పరిరక్షణ, దుస్తులు(Cloths), ఆన్లైన్ షాపింగ్(Online shopping), పాన్ మసాలాలకు(Tobbaco) సంబంధించిన ప్రొడక్టుల ప్రచారంలో సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్(alshay Kumar), అమితాబ్ బచ్చన్(Amit Bachchan), రణ్వీర్ సింగ్(Ranveer singh), అజయ్ దేవగణ్(Ajay Devgan), షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), విద్యా బాలన్(Vidhya Balan), ఆలియా భట్(Alia Bhatt), అనుష్క శర్మ(Anushka sharma), కత్రినా కైఫ్(Katrina Kaif), కియరా ఆడ్వాణీలతో(Kiara advani) కూడిన ప్రకటనలే ఎక్కువగా ఉన్నాయి. తారలు పాల్గొనే 40శాతానికి పైగా ప్రకటనల్లో అక్షయ్ కుమార్-ట్వింకిల్ ఖన్నా(Twinkle Khanna), అమితాబ్ బచ్చన్- జయాబచ్చన్(Jaya Bachchan), అనుష్క శర్మ- విరాట్ కోహ్లి(Virat Kohli) జంటలవే ఎక్కువని టామ్ నివేదిక పేర్కొంది.

Updated On 31 Dec 2023 1:38 AM GMT
Ehatv

Ehatv

Next Story