ఎలక్టోరల్‌ బాండ్స్‌(Electoral Bonds) కేసులో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI) చేసుకున్న విన్నపాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. గడువును పొడిగించే ప్రసక్తే లేదని , రేపటిలోగా బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి(Election commission) అందించాలని ఎస్‌బీఐని ఆదేశించింది. అలాగే ఈ నెల 15వ తేదీలోపు బాండ్ల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ధిక్కరించిందని సీపీఎం వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది.

ఎలక్టోరల్‌ బాండ్స్‌(Electoral Bonds) కేసులో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI) చేసుకున్న విన్నపాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. గడువును పొడిగించే ప్రసక్తే లేదని , రేపటిలోగా బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి(Election commission) అందించాలని ఎస్‌బీఐని ఆదేశించింది. అలాగే ఈ నెల 15వ తేదీలోపు బాండ్ల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ధిక్కరించిందని సీపీఎం వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఎస్‌బీఐ తీరుపై సుప్రీంకోర్టు(Supreme court) ఆగ్రహం వ్యక్తం చేసింది. 26 రోజుల పాటు ఏం చేశారని ఎస్‌బిఐని ప్రశ్నించింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్‌ 30 వరకూ పొడిగించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. సీల్డ్ కవర్ తెరిచి వివరాలు సేకరించి ఎన్నికల సంఘానికి ఇస్తే చాలని చెప్పింది.. అయితే దాతల వివరాల్ని సరిపోల్చుకోవడానికి సమయం పడుతుందని చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఎదుట ఎస్‌బీఐ తెలిపింది. దీనికి సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. గత 26 రోజులుగా ఏం చేశారని బెంచ్‌ ప్రశ్నించింది. రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. బాండ్ల జారీని తక్షణమే ఆపేయాలంటూ ఎస్‌బీఐని ఆదేశించింది. ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను ఈ నెల 6వ తేదీలోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్‌బీఐని ఆదేశించింది కూడా. ఆ సమాచారాన్ని.. పబ్లిక్‌ డొమైన్‌ ద్వారా ఈ నెల 13లోగా బహిరంగపరచాలని ఈసీకి స్పష్టంచేసింది. అయితే ఇంత తక్కువ సమయంలో ఈసీకి సమాచారం సమర్పించడం కష్టమని, కాబట్టి గడువును పొడిగించాలని సుప్రీంకోర్టులో ఎస్‌బీఐ పిటిషన్‌ వేసింది. అలాగే మార్చి 6వ తేదీలోగా ఈ సమాచారాన్ని ఈసీకి అందించకపోవడం ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎస్‌బీఐ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందంటూ మరో పిటిషన్‌ దాఖలైంది.

Updated On 11 March 2024 3:46 AM GMT
Ehatv

Ehatv

Next Story