ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ఘాజీపుర్‌(Ghazipur) జిల్లాలో ఓ విచిత్రం జరిగింది. దీన్ని విచిత్రమనాలో, గమ్మత్తన్నాలో తెలియడం లేదు. దేశ ప్రధాని ఎవరో చెప్పలేదన్న కారణంగా ఓ యువతి పెళ్లి కొడుకు తమ్ముడిని మనువాడిన వింత ఘటన ఇది! కాసింత కన్ఫ్యూజింగ్‌గా ఉంది కదూ! డిటైల్డ్‌గా చెప్పుకుందాం! శివశంకర్‌ అనే 27 ఏళ్ల యువకుడికి రంజన అనే యువతికి పెళ్లి కుదిరింది.

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ఘాజీపుర్‌(Ghazipur) జిల్లాలో ఓ విచిత్రం జరిగింది. దీన్ని విచిత్రమనాలో, గమ్మత్తన్నాలో తెలియడం లేదు. దేశ ప్రధాని ఎవరో చెప్పలేదన్న కారణంగా ఓ యువతి పెళ్లి కొడుకు తమ్ముడిని మనువాడిన వింత ఘటన ఇది! కాసింత కన్ఫ్యూజింగ్‌గా ఉంది కదూ! డిటైల్డ్‌గా చెప్పుకుందాం! శివశంకర్‌ అనే 27 ఏళ్ల యువకుడికి రంజన అనే యువతికి పెళ్లి కుదిరింది. ఆరు నెలల కిందట వివాహ నిశ్చయ కార్యక్రమం జరిగింది. జూన్‌ 11న పెళ్లి కూడా ఘనంగా జరిగింది. పెళ్లి వేడుకలో భాగంగా పెళ్లి కూతురు ఇంట్లో ఓ చిన్న విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో శివశంకర్‌ తన మరదలు, బావమరిదితో సరదాగా మాటలు కలిపాడు. పిచ్చాపాటిలో భాగంగా ఉన్నట్టుండి మన దేశ ప్రధాని ఎవరని మరదలు శివశంకర్‌ను అడిగింది. ఆ ప్రశ్నకు శివశంకర్‌ జవాబివ్వలేకపోయాడు. ఇది చూసిన పెళ్లి కూతురు బంధువులు పకపకమంటూ నవ్వారు. శివశంకర్‌ను హేళన చేశారు. అక్కడే ఉన్న రంజన బాగా హర్టయ్యారు. అది తీవ్ర అవమానంగా భావించారు. వెంటనే శివశంకర్‌ తమ్ముడైన అనంత్‌ను అక్కడికక్కడే మరో పెళ్లి చేసుకున్నారు. రంజన కంటే అనంత్‌ వయసులో చిన్నవాడు కావడం గమనార్హం..

Updated On 20 Jun 2023 11:48 PM GMT
Ehatv

Ehatv

Next Story