త్వరలో జరగబోతున్న లోక్‌సభ ఎన్నికల(Lok sabha Elections) కోసం భారతీయ జనతా పార్టీ(BJP) ప్రకటించిన అయిదో జాబితాలో బాలీవుడ్‌ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌(Kangana Ranaut)కు చోటు లభించిన విషయం తెలిసిందే. హిమాచల్‌ప్రదేశ్‌(Himachal Pradesh)లోని మండి లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ను కంగనాకు ఇచ్చింది బీజేపీ.

త్వరలో జరగబోతున్న లోక్‌సభ ఎన్నికల(Lok sabha Elections) కోసం భారతీయ జనతా పార్టీ(BJP) ప్రకటించిన అయిదో జాబితాలో బాలీవుడ్‌ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌(Kangana Ranaut)కు చోటు లభించిన విషయం తెలిసిందే. హిమాచల్‌ప్రదేశ్‌(Himachal Pradesh)లోని మండి లోక్‌సభ నియోజకవర్గం(Mandi Lok Sabha constituency) టికెట్‌ను కంగనాకు ఇచ్చింది బీజేపీ. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్‌ గతంలో చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. అప్పుడు ఈ ఉత్తమ నటి ఏమన్నారంటే పేదరికం, సమస్యలు, నేరాలు లేని హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి తాను పోటీ చేయబోనని, ఒకవేళ రాజకీయాలలోకి వస్తే మాత్రం సమస్యలు ఉన్న రాష్ట్రం నుంచే పోటీ చేస్తానని, అక్కడి సమస్యలు పరిష్కరించి రాజకీయరంగంలోనూ రాణి అవుతానని లెక్చర్లిచ్చారు. ఇప్పుడు బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కంగనా రనౌత్‌కు హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ టికెటే లభించింది. బీజేపీ తనకు మండి లోక్‌సభ టికెట్ ఇవ్వడంపై కంగనా రియాక్టయ్యింది. ఇది తాను గౌరవంగా భావిస్తున్నానని, పార్టీ హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మళ్లీ ట్వీటింది. మండి నుంచి తాను పోటీ చేయనన్న పాత ట్వీట్‌ను చూపిస్తూ ఇప్పుడు కొత్తగా ఆమె చేసిన ప్రకటనను పక్కన పెడుతూ సోషల్‌ మీడియాలో తెగ ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. మాట మార్చడంలో మెడల్ ఏదైనా ఇస్తే అది కచ్చితంగా కంగనాకే దక్కుతుందని సెటైర్లు విసురుతున్నారు.

Updated On 25 March 2024 4:08 AM GMT
Ehatv

Ehatv

Next Story