తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాతో పోల్చారు. ఉదయనిధి ప్రకటన దేశంలో సంచలనం సృష్టించింది.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) తనయుడు ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin) సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాతో పోల్చారు. ఉదయనిధి ప్రకటన దేశంలో సంచలనం సృష్టించింది. ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ(BJP).. I.N.D.I.A కూట‌మిపై ఫైర్ అయ్యారు.

ఇదిలా ఉండగా.. బుధవారం ఢిల్లీలోని ద్వారకలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్మృతి ఇరానీ(Smriti Irani) మాట్లాడుతూ.. ఈ పుణ్యభూమిపై భక్తులు జీవించి ఉన్నంత వరకు అలాంటిదేమీ జరగదని.. సనాతన ధర్మాన్ని సవాలు చేసిన వారి చెవులకు మన గొంతు చేరాలని అన్నారు. ఇది మన మతం, విశ్వాసాన్ని సవాలు చేయదని అన్నారు.

I.N.D.I.A. గ్రూపులో డీఎంకే(DMK) ప్రధాన భాగం. ఉదయనిధి ప్రకటనపై కాంగ్రెస్(Congress) మౌనం వహించింది. దీంతో కాంగ్రెస్, ప్రతిపక్షాలు సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Sha) నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) వరకు అన్నారు. బుధవారం జన్మాష్టమి సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఈ విషయంపై విపక్షాలను పరోక్షంగా టార్గెట్(Target) చేశారు.

బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధాని మోదీ కూడా ఈ అంశంపై చర్చించారు. ఈ విషయంలో సరైన సమాధానం చెప్పాలని మంత్రివర్గ సమావేశంలో అన్నారు. సనాతన ధర్మాన్ని అవమానించడం ద్వారా ప్రతిపక్షాలు ఇరుక్కుపోయాయని.. ప్రతిపక్షంలో అశాంతి స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని అన్నారు.

Updated On 6 Sep 2023 10:19 PM GMT
Yagnik

Yagnik

Next Story