ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) వారణాసిలో(Varanasi) కాల్పుల(Shoot out) ఘటన కలకలం సృష్టించింది

ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) వారణాసిలో(Varanasi) కాల్పుల(Shoot out) ఘటన కలకలం సృష్టించింది. సమాజ్‌వాదీ పార్టీ(Samajvadi Party) నాయకుడు, మాజీ కార్పొరేటర్‌ విజయ్‌ యాదవ్‌(Vijay yadav) ఇంటి దగ్గర కొందరు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారితో పాటు ఆరుగురు గాయపడ్డారు. దశాశవమేథ్‌ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబాన్ని మొత్తం హత్య చేయడానికి పన్నాగం పన్నిన దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. ఈ మేరకు విజయ్‌ యాదవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లయింట్‌ ఆధారంగా అంకిత్‌ యాదవ్‌, శోభిత వర్మ, గోవింద్‌ యాదవ్‌, సాహిల్‌ యాదవ్‌తో పాటు పలువురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. గాయపడినవారు చికిత్స తీసుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story