సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి (72) గురువారం కన్నుమూశారు

సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి (72) గురువారం కన్నుమూశారు. వార్తా సంస్థ PTI ప్రకారం.. ఆయ‌న ఇటీవ‌ల ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లో చేరి చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయ‌న‌ చాలా కాలంగా వెంటిలేట‌ర్‌పైనే ఉన్నారు. మల్టీడిసిప్లినరీ వైద్యుల బృందం ఆయ‌న‌ పరిస్థితిని పర్యవేక్షించింది. ఏచూరి మ‌ర‌ణవార్త‌ను పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీతారాం ఏచూరి ఇటీవల కంటిశుక్లం శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. 1975లో విద్యార్థి నాయకుడిగా ఎమర్జెన్సీని వ్యతిరేకించారు. ఇందుకోసం ఆయ‌న‌ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. 1952 ఆగస్టు 12న చెన్నైలో తెలుగు మాట్లాడే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయ‌న‌.. 2016లో రాజ్యసభలో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా అందుకున్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story