కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నదానిపైనే అందరి చూపు పడింది. నిన్న‌టి వ‌ర‌కూ ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు దాదాపు తెరపడినట్లేన‌ని తెలుస్తోంది. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వస్తున్నాయి.

కర్నాటక ఎన్నికల్లో(Karnataka Elections) కాంగ్రెస్ విజయం తర్వాత.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి(Cheif Minister) ఎవరన్నదానిపైనే అందరి చూపు పడింది. నిన్న‌టి వ‌ర‌కూ ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు దాదాపు తెరపడినట్లేన‌ని తెలుస్తోంది. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య(Siddaramaiah), ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్(DK Shivakumar) ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjuna Kharge) ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ నేప‌థ్యంలో బెంగళూరులో ఈరోజు (మే 18) సాయంత్రం 7 గంటలకు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

మే 20న బెంగుళూరులో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించేందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కేంద్ర పరిశీలకులు బెంగళూరు(Bengaluru)కు చేరుకోవాలని కోరారు. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిని ఈరోజు లేదా రేపు నిర్ణయిస్తామని, 72 గంటల్లో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ కర్ణాటక ఇంచార్జ్ రణదీప్ సూర్జేవాలా(Randeep Surjewala) బుధవారం తెలిపారు.

అంతకుముందు, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్ సుర్జేవాలాను అతని నివాసంలో కలిశారు. శివకుమార్ తన సోదరుడు పార్టీ ఎంపీ డీకే సురేష్(DK Suresh) నివాసంలో పార్టీ నాయకులు, మద్దతుదారులతో కూడా చర్చించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal), కర్ణాటక పార్టీ ఇన్‌చార్జి రణదీప్ సూర్జేవాలా, ఆ పార్టీ నేత ఎంబి పాటిల్(MB Patil) బుధవారం సాయంత్రం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసానికి చేరుకున్నారు.

వేణుగోపాల్ నివాసానికి చేరుకున్న శివకుమార్.. చెప్పేదేమీ లేదని.. హైకమాండ్‌కే వదిలేశాం.. హైకమాండ్ పిలుస్తుందని చెప్పారు. నేను విశ్రాంతి తీసుకోబోతున్నాను. రాహుల్ గాంధీ(Rahul Gandhi), మల్లికార్జున్ ఖర్గేలతో సమావేశం గురించి అడిగినప్పుడు.. శివకుమార్ "ఏమీ కాదు, చర్చ లేదు. జస్ట్ గ్రీటింగ్స్.." అని అన్నారు.

వర్గాల సమాచారం ప్రకారం.. శివకుమార్‌కు ఆరు ముఖ్యమైన శాఖలతో డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేశారు. రెండో ప్రతిపాదన అధికారాన్ని పంచుకోవడం. ఇందులోభాగంగా తొలి రెండేళ్లు సిద్ధరామయ్యను, మూడేళ్లు శివకుమార్‌ను సీఎం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. ముందుగా తనకు అవకాశం ఇవ్వాలని శివకుమార్ అన్నారు. అయితే ఏ షరతులతో ఆయన డిప్యూటీ సీఎం అయ్యేందుకు అంగీకరించారనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.

బుధవారం ఉదయం సిద్ధరామయ్య రాహుల్ గాంధీని కలిశారు. వారు వెళ్లిన కొద్దిసేపటికే శివకుమార్ చేరుకున్నారు. ఈ సమయంలో శివకుమార్‌తో సోనియా గాంధీ(Soniya Gandhi)ని ఫోన్‌లో మాట్లాడిచ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌ని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన త్యాగం వృథా కాబోదని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా శివకుమార్ మాత్రం సీఎం పదవి త‌గ్గేందుకు సిద్ధపడలేదు. మంగ‌ళ‌వారం కూడా ఇద్దరు నేతలు ఖర్గేను విడివిడిగా కలిశారు. ముగ్గురు కేంద్ర పరిశీలకులు బుధవారం ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు.

ఢిల్లీలో సుదీర్ఘ చ‌ర్చ‌ల అనంత‌రం.. బెంగుళూరులోని సిద్ధరామయ్య మద్దతుదారులు సంబరాలు ప్రారంభించారు. ఆయన సీఎం అవుతార‌ని మద్దతుదారులు పూర్తి నమ్మకంతో ఉన్నారు. శివకుమార్ మద్దతుదారులు కూడా తమ నాయకుడి కోసం ప్లకార్డులు పట్టుకుని ఢిల్లీ(Delhi)లోని 10 జనపథ్ వెలుపల నిలబడి ఉన్నారు.

ఇదే సమయంలో.. ఫ‌లితాలు వెలువ‌డి నాలుగైదు రోజుల‌వుతున్నా కూడా.. ముఖ్యమంత్రిని ఎన్నుకోలేకపోయినందుకు కాంగ్రెస్ పార్టీపై బీజేపీ(BJP) మండిపడింది. కర్నాటక ముఖ్యమంత్రిని నిర్ణయించడంలో జాప్యంపై కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టిన మాజీ సిఎం బసవరాజ్ బొమ్మై(Basavaraj Bommai).. పూర్తి మెజారిటీ వచ్చినప్పటికీ పార్టీలో "ఐక్యత లోపాన్ని" చూపుతుందని అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజలు(Karnataka People) కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, అందుకే రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని మాజీ సీఎం అన్నారు. సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పటికీ ముఖ్యమంత్రిని నిర్ణయించడంలో జాప్యం పార్టీలో ఐక్యత లోపానికి నిదర్శనమని బొమ్మై అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడం మానేసి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని, దీనిపై ఇంతకు మించి మాట్లాడేందుకు ఇష్టపడబోనని బొమ్మై అన్నారు.

Updated On 17 May 2023 10:00 PM GMT
Yagnik

Yagnik

Next Story