పాకిస్తాన్‌కు(Pakistan) చెందిన సీమా హైదర్‌తో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌ మీనాకు పబ్జీలో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ప్రియుడిపై మోజుతో తన పిల్లలలో సహా భారత్‌కు అక్రమంగా వచ్చేసింది. ఆమె భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె భర్త గులాం హైదర్‌(Gulam Haider) తన భార్య సీమా హైదర్‌ను, పిల్లలను వెనక్కి పంపించాలని సోషల్ మీడియా(Social media) ద్వారా భారత ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. సీమా హైదర్ భారతదేశానికి వచ్చిన తర్వాత, పాకిస్తాన్‌లోని ఆమె భర్త గులాం హైదర్ తన సొంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాడు.

పాకిస్తాన్‌కు(Pakistan) చెందిన సీమా హైదర్‌తో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌ మీనాకు పబ్జీలో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ప్రియుడిపై మోజుతో తన పిల్లలలో సహా భారత్‌కు అక్రమంగా వచ్చేసింది. ఆమె భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె భర్త గులాం హైదర్‌(Gulam Haider) తన భార్య సీమా హైదర్‌ను, పిల్లలను వెనక్కి పంపించాలని సోషల్ మీడియా(Social media) ద్వారా భారత ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. సీమా హైదర్ భారతదేశానికి వచ్చిన తర్వాత, పాకిస్తాన్‌లోని ఆమె భర్త గులాం హైదర్ తన సొంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాడు. ఈ ఛానెల్ ద్వారా గులాం హైదర్ తన సందేశాన్ని భారత్‌, పాకిస్తాన్ ప్రజలకు తెలియచేస్తున్నాడు. తాజాగా గులాం హైదర్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్(Social media viral) అవుతోంది. ఈ వీడియోలో గులాం హైదర్‌ భారత ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశాడు. తన పిల్లలను పాకిస్తాన్‌కు తిరిగి పంపించాలని భారత ప్రభుత్వానికి విన్నవించుకోవడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే సీమా హైదర్‌ తరపు న్యాయవాది ఏపీ సింగ్‌, నేత్రపాల్‌లను గులాం హైదర్‌ హెచ్చరించడం కూడా వీడియోలో కనిపిస్తోంది. తొందరలోనే తాను భారత్‌కు(Bharat) వస్తానని గులాం హైదర్‌ వీడియోలో చెప్పాడు. భార్య సీమా హైదర్‌పై పలు ఆరోపణలు చేశాడు. తన పిల్లలను భారత్‌కు అక్రమంగా తీసుకెళ్లిందని ఆరోపించాడు. తన పిల్లలను తనతోపాటు తీసుకురావడానికి తాను తప్పనిసరిగా ఇండియాకు వెళతానని, భారత ప్రజలపై, అక్కడి చట్టాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నాడు. తన పోరాటానికి భారత్‌లో తప్పకుండా మద్దతు దొరుకుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.
‘సీమా హైదర్ ఒక దొంగ, నేరస్తురాలు, నా ఆస్తి, ఇల్లు అమ్మేసి ఇండియా పారిపోయింది. అందుకే ఈరోజున నేను రోడ్డున పడ్డాను. సీమా హైదర్‌...ఇక నువ్వు ఏం చేసినా తప్పే. నువ్వు ఏడుస్తావు. పశ్చాత్తాపపడతావు. బాధపడతావు. ఆర్తనాదాలు చేస్తావు.. ఏదో ఒక రోజు నేను నిన్ను ఉరికంబం ఎక్కిస్తాను. ఇదే నా జీవిత లక్ష్యం’ అని గులాం హైదర్ అన్నాడు. అలాగే సీమా ప్రియుడు సచిన్, న్యాయవాదులు ఏపీ సింగ్, నేత్రపాల్‌లను హెచ్చరించాడు.‘గుర్తుంచుకోండి. మీరు ఇప్పటివరకు ఏమి చేసినా, ఏదో ఒకరోజు మీ అందరికీ శిక్ష పడుతుంది’ అని వీడియోలో గులాం హైదర్‌ తెలిపాడు.

Updated On 8 Jan 2024 9:38 AM GMT
Ehatv

Ehatv

Next Story