చైల్డ్‌ పోర్నోగ్రఫీ( child pornography) చూడటం నేరం కాదని మద్రాస్‌ హైకోర్టు(Madras high court) గతంలో తీర్పు ఇచ్చింది.

చైల్డ్‌ పోర్నోగ్రఫీ( child pornography) చూడటం నేరం కాదని మద్రాస్‌ హైకోర్టు(Madras high court) గతంలో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. చైల్డ్‌ పోర్నోగ్రఫీ చూడటం ముమ్మాటికీ నేరమేనని సీజేఐ(CJI) ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. పోక్సో(POCSO) చట్టం సెక్షన్‌ 15 ప్రకారం.. చైల్డ్‌ పోర్నోగ్రఫీ ఫోటోలు, వీడియోలు చూడమే కాదు, వాటిని స్టోర్‌ చేసి పెట్టుకోవడం కూడా నేరమేనని సుప్రీంకోర్టు(Supremecourt) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది.

గతంలో మద్రాస్‌ హైకోర్టు తీర్పును తప్పని చెబుతూ దాన్ని కొట్టేసింది. అలాగే ఈ కేసులో నిందితుడికి ఇచ్చిన ఊరటను ఎత్తేసింది. అతడిపై క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ కొనసాగించాలని స్పష్టం చేసింది. ఇకపై కోర్టులు కూడా చైల్డ్‌ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించవద్దని సుప్రీం కోర్టు సూచించింది. తమిళనాడుకు చెందిన 28ఏళ్ల యువకుడు చైల్డ్‌ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని చూశాడనే అభియోగాలపై క్రిమినల్‌ చర్యలను నిలిపివేస్తూ మద్రాస్‌ హైకోర్టు ఈ ఏడాది జనవరి 11వ తేదీన తీర్పు చెప్పింది. ఆ యువకుడు వీడియోలు చూశాడే తప్ప ఇతరులకు పంపలేదని కోర్టు తెలిపింది. ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 67బీ కింద అతని చర్య నేరం కాదని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం.. ఛైల్డ్‌ పోర్నోగ్రఫీని చూడటం తప్పేమీ కాదంటూ జస్టిస్‌ ఎన్‌ ఆనంద్‌ వెంకటేశ్‌ వ్యాఖ్యానించారు. ఇలాంటి కేసుల్లో దోషులను శిక్షించే బదులు, వారికి సరైన మార్గం చూపడం ముఖ్యమని ఎన్‌ ఆనంద్‌ వెంకటేశ్‌ అభిప్రాయపడ్డారు.

మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఫరీదాబాద్‌కు చెందిన జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ అలయెన్, ఢిల్లీకి చెందిన బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ అనే ఎన్‌జీవోలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మద్రాస్‌ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా,జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఏప్రిల్‌లో వాదనలు ముగించి.. తీర్పును రిజర్వ్‌ చేసింది. అయితే విచారణ సందర్భంలోనే.. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఏడాది జులైలో కర్ణాటక హైకోర్టు కూడా చైల్డ్‌ పోర్నోగ్రఫీ చూడడం ఐటీ యాక్ట్‌ కింద నేరం కాదని తెలిపింది. అయితే రెండు వారాలు తిరగకముందే ఆ తీర్పును రీకాల్‌ చేస్తూ మరో తీర్పు ఇచ్చింది కర్ణాటక హైకోర్టు.

Eha Tv

Eha Tv

Next Story