ఏడాది కాదు, రెండేళ్లు కాదు.. ఎనిమిదేళ్లుగా వారిద్దరు ప్రేమించుకున్నారు. అయినా ప్రేమికుడు ఎలాంటివాడో తెలుసుకోలేకపోయింది. తాళి కట్టిన వెంటనే అతగాడు పారిపోవడంతో ఇప్పుడామో పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన తమిళనాడులో(Tamilnadu) జరిగింది.

ఏడాది కాదు, రెండేళ్లు కాదు.. ఎనిమిదేళ్లుగా వారిద్దరు ప్రేమించుకున్నారు. అయినా ప్రేమికుడు ఎలాంటివాడో తెలుసుకోలేకపోయింది. తాళి కట్టిన వెంటనే అతగాడు పారిపోవడంతో ఇప్పుడామో పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన తమిళనాడులో(Tamilnadu) జరిగింది. కళ్లకురచ్చి జిల్లా ఉళుందూర్‌పేట సమీపం సరుత్తనూర్‌ గ్రామానికి చెందిన గోవిందస్వామి ఏసు కూతురు రోస్లిన్ మేరీ(Rosline Merry) (25) చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా(Nurse) పని చేస్తున్నది. అదే గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ తమిళరసన్‌ చెన్నైలోని ఓ ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నాడు. వీరిద్దరు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామని యువతి పదే పదే ఒత్తడి చేస్తూ వచ్చింది. ఎప్పటికప్పుడు ప్రియుడు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు. ఇక లాభం లేదనుకుని ఆ అమ్మాయి ఉళుందూర్‌పేట పోలీసుస్టేషన్‌లో కంప్లయింట్‌ చేసింది. పోలీసులు రెండు కుటుంబాల వారిని స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. పోలీసులు చెప్పినా ఆ యువకుడు వినకపోవడంతో బొక్కలో తోస్తామని హెచ్చరించారు. దాంతో జడుసుకున్న తమిళరసన్‌ పెళ్లికి ఒప్పుకున్నాడు. అమ్మాయి కుటుంబీకుల ఒత్తిడితో సోమవారం ఓ ఆశ్రమంలో రోస్లిన్‌ మేరికి తాళి కట్టి పెళ్లి(Marriage) చేసుకున్నాడు. కాసేపటికే అక్కడ్నుంచి పారిపోయాడు. దీంతో యువతి మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. ఇప్పుడు కొత్త పెళ్లి కొడుకు కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Updated On 7 May 2024 1:01 AM GMT
Ehatv

Ehatv

Next Story