బాలీవుడ్‌ నటుడు రితీశ్‌ దేశ్‌ముఖ్‌(Ritesh deshmukh) కన్నీటి పర్యంతమయ్యాడు. తన తండ్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా బరస్టయ్యాడు. ఎమోషనలయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో(ocial media) వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని లాతూర్‌లో దివంగత కాంగ్రెస్‌ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాసరావు దేశ్‌ముఖ్‌(Vilasarao Deshmukh) విగ్రహాన్ని ఆవిష్కరించారు.

బాలీవుడ్‌ నటుడు రితీశ్‌ దేశ్‌ముఖ్‌(Ritesh deshmukh) కన్నీటి పర్యంతమయ్యాడు. తన తండ్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా బరస్టయ్యాడు. ఎమోషనలయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో(ocial media) వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని లాతూర్‌లో దివంగత కాంగ్రెస్‌ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాసరావు దేశ్‌ముఖ్‌(Vilasarao Deshmukh) విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రితీశ్‌ మాట్లాడుతూ నాన్న చనిపోయి 12 ఏళ్లు అయ్యిదంటూ కన్నీరు పెట్టుకున్నాడు. పక్కనే ఉన్న అతడి అన్న, లాతూర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అమిత్ దేశ్‌ముఖ్‌(Amit deshmukh) రితీశ్‌ను ఓదార్చారు. రితీశ్‌ ఏం మాట్లాడారంటే 'సాహెబ్ (విలాస్‌రావ్ దేశ్‌ముఖ్) మనల్ని విడిచిపెట్టి పన్నెండేళ్లు దాటాయి. ఆయన లేకపోవడం ఎంతో బాధగా ఉంది. ఆయన ఈ రాష్ట్ర ప్రజల్లో ఎప్పుడూ వెలుగుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా ప్రకాశిస్తున్నారు. ఆయన గొప్పతనం ఎప్పటికీ మసకబారదు. అతను ప్రజల కోసం బలంగా నిలబడ్డాడు. ఈ రోజు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, మనపై ఆయన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది' అంటూ రితీష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 2012లో హీరోయిన్‌ జెనీలియాను(Jenelia) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రితీశ్‌. వీరిద్దరు కలిసి చాలా చిత్రాలలో నటించారు. వీరిద్దరు కలిసి నటించిన చివరి సినిమా వేద్‌. తెలుగులో హిట్‌ అయిన మజిలీకి ఇది రీమేక్‌!

Updated On 19 Feb 2024 1:51 AM GMT
Ehatv

Ehatv

Next Story