డాక్టర్‌పై అత్యాచారం కేసులో అట్టుడుకుతున్న కోల్‌కతా

పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ను(Sanjay ray) పశ్చిమ బెంగాల్ పోలీసులు బుధవారం కోల్‌కతాలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల (సిజిఓ) కాంప్లెక్స్‌కు తీసుకువచ్చారు. కోల్‌కతా హైకోర్టు(Kolkata High court) ఆదేశాల మేరకు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసును స్వాధీనం చేసుకుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక వైద్య, ఫోరెన్సిక్ బృందాలను పంపారు. ఢిల్లీ నుంచి సీబీఐ బృందం సభ్యులు కూడా కోల్‌కతాలోని సీజీవో కాంప్లెక్స్‌లో విచారణ ప్రారంభించింది సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం, ఢిల్లీ నుంచి మెడికల్ ఆఫీసర్లు, ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన ప్రత్యేక బృందం కోల్‌కతాలోని నేరస్థలానికి చేరుకుంది, అక్కడే వైద్యురాలిపై అత్యాచారం జరిగింది.

మంగళవారం, ఆగస్టు 9న జరిగిన మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై జరిగిన లైంగిక వేధింపులు, హత్యపై కోల్‌కతా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌.జి. కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(RG Kar Medical college) సెమినార్ హాల్‌లో శవమై కనిపించారు. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు సంబంధించి కోల్‌కతా పోలీసులు ఇప్పటివరకు పౌర వాలంటీర్ అయిన సంజోయ్ రాయ్‌ను అరెస్టు చేశారు. మరోవైపు బుధవారం ఉదయం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ చేపట్టింది. మమతా బెనర్జీ ఉదాసీనత, కోల్‌కతా పోలీసుల ప్రయత్నాలవల్ల పశ్చిమ బెంగాల్ ఆగ్రహంతో రగిలిపోతుండగా, ఆర్‌.జి. కర్ మెడికల్ కాలేజీ అధికారులు చెస్ట్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ లోపల గది గోడలను పగలగొట్టారని బీజేపీ ఆరోపిస్తోంది.

కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసులో తాజా రాజకీయ దుమారం చెలరేగింది, ఈ సంఘటనకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు(Evidance Tampering) చేయడానికి ఆర్‌.జి. క మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రి అధికారులు ప్రయత్నిస్తున్నారని వామపక్ష సంఘాలు, భారతీయ జనతా పార్టీ ఆరోపించాయి. సీపీఐ(ఎం) అనుబంధ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI) మరియు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) కొద్ది రోజుల క్రితం డాక్టర్ మృతదేహాన్ని కనుగొన్న సెమినార్ గదికి సమీపంలో పునరుద్ధరణ(Renovation) పనులు ప్రారంభించాయని ఆరోపిస్తున్నారు.. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసి అసలు దోషులను రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎమర్జెన్సీ బిల్డింగ్ గేటు వద్ద నిరసనకు దిగారు. బాధితురాలిపై పలువురు వ్యక్తులు అత్యాచారం చేసి ఉండవచ్చని పోస్ట్‌మార్టం నివేదిక సూచించిందని లెఫ్ట్-అఫిలియేట్ జాయింట్ ఫోరమ్ ఆఫ్ డాక్టర్స్‌కు చెందిన ఒక వైద్యుడు పేర్కొన్నారు. ఇది ఒక్క వ్యక్తి చేసిన పని కాదని.. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని స్పష్టంగా అర్థమవుతోంది’’ అని పోస్ట్‌మార్టం నివేదిక చూసినప్పుడు బాధితురాలి కుటుంబంతో పాటు ఉన్న వైద్యురాలు సుబర్ణ గోస్వామి అన్నారు.

Eha Tv

Eha Tv

Next Story