గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా బంగారం(Smuggled Gold) స్మగ్లింగ్ చేస్తున్న ముఠా దాందా వెలుగు లోకి వచ్చింది. పాట్నా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) నిర్వహించిన ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీం చేసుకున్నారు.

గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా బంగారం(Smuggled Gold) స్మగ్లింగ్ చేస్తున్న ముఠా దాందా వెలుగు లోకి వచ్చింది. పాట్నా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) నిర్వహించిన ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీం చేసుకున్నారు. ఈ క్రమంలో 40.08 కోట్ల రూపాయల విలువైన 61.08 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు 13 లక్షల రూపాయల నగదు, 17 కార్లు, 30 మొబైల్స్‌, 21 ఇంటర్నెట్‌ డాంగిల్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో డీఆర్‌ఐ పాట్నా, ముజఫర్‌ పూర్, గోరఖ్‌ పూర్, అస్సాం యూనిట్లు పాల్గొన్నాయి. నిజానికి గౌహతి లోని నివాస సముదాయం నుంచి బంగారం స్మగ్లింగ్ సిండికేట్ నిర్వహిస్తున్నట్లు DRI కి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అస్సాం యూనిట్ ఏజెన్సీ పలు చోట్ల సోదాలు చేసింది. ఇందులో 22.74 కిలోల బరువున్న 137 బంగారు బిస్కెట్లు, 13 లక్షల రూపాయల నగదు లభించాయి.

Updated On 14 March 2024 5:19 AM GMT
Ehatv

Ehatv

Next Story