దాదాపు 400 స్తంభాలు, 44 తలుపులు, సరికొత్త రాముడి విగ్రహం. అయోధ్యలో గ్రాండ్ టెంపుల్‌ను ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ(Narendra modi) అధికారికంగా ప్రారంభించారు, వందలాది మంది మత ప్రముఖులు, రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

దాదాపు 400 స్తంభాలు, 44 తలుపులు, సరికొత్త రాముడి విగ్రహం. అయోధ్యలో గ్రాండ్ టెంపుల్‌ను ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ(Narendra modi) అధికారికంగా ప్రారంభించారు, వందలాది మంది మత ప్రముఖులు, రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
పురాతన నగరం అయోధ్యలో(Ayodhya) ఘనంగా ఈ వేడుక జరిగింది. రామమందిర(Ram Mandir) నిర్మాణంలో 500 సంవత్సరాల వివాదానికి తెరపడింది. ఏ సంవత్సరంలో ఏం జరిగిందో చూద్దాం.

1528: మొఘల్ చక్రవర్తి బాబర్(King Barbar) కమాండర్ అయిన మీర్ బాకీ 1528లో బాబ్రీ మసీదును నిర్మించడంతో రామమందిర ఉద్యమం ప్రారంభమైంది. హిందూ దేవాలయ శిథిలాలపై మసీదును నిర్మించారని.. దీంతొ దశాబ్దాలపాటు రెండు వర్గాల మధ్య చర్చలు, ఘర్షణలు చెలరేగాయి.

1751: భారతీయ జనతా పార్టీకి చెందిన రచయిత, మాజీ రాజ్యసభ ఎంపి బల్బీర్ పుంజ్ తన పుస్తకం 'ట్రైస్ట్ విత్ అయోధ్య: డీకోలనైజేషన్ ఆఫ్ ఇండియా'లో, మరాఠాలు అయోధ్య, కాశీ, మధురపై నియంత్రణ సాధించాలని కోరుకున్నారని తన పుస్తకంలో రాశారు.

1858లో, నిహాంగ్ సిక్కులు బాబ్రీ మసీదును రాముడి జన్మస్థలంగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన వివాదాస్పద స్థలంపై నియంత్రణ కోసం పోరాటానికి నాంది పలికింది.

1885లో నిర్మోహి అఖారా పూజారి రఘుబర్ దాస్ 1885లో మసీదు బయటి ప్రాంగణంలో ఆలయాన్ని నిర్మించేందుకు తొలిసారిగా కోర్టులో దావా వేశారు. దీంతో ఈ స్థలం చుట్టూ కంచెను బ్రిటిష్‌ ప్రభుత్వం వేసింది. అది దాదాపు 90 సంవత్సరాలు అలాగే ఉంది.

డిసెంబరు 22, 1949 రాత్రి, బాబ్రీ మసీదు లోపల 'రామ్ లల్లా' విగ్రహాలను కనిపించాయి, సైట్ చుట్టూ మతపరమైన భావాలను తీవ్రతరం చేయడంతో వివాదం మరింత చెలరేగింది. మసీదు లోపల విగ్రహాలు కనిపించాయని హిందువులు పేర్కొన్నారు. తొలిసారిగా ఈ వివాదం కోర్టుకు వెళ్లింది.

1950-1959: తరువాతి దశాబ్దంలో చట్టపరమైన కోర్టులో పిటిషన్లు పెరిగాయి. నిర్మోహి అఖారా విగ్రహాలను పూజించే హక్కులను కోరుతూ పిటిషన్‌ వేయగా.. స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు కోరింది

1986లో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాబ్రీ మసీదు తాళాలు తెరిచి హిందువులు లోపల పూజలు చేయడానికి అనుమతించారు. ఈ నిర్ణయం ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది.

1990లో విశ్వహిందూ పరిషత్ (VHP) రామమందిర నిర్మాణానికి డెడ్‌లైన్ విధించింది, ఈ కాలంలోనే బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ రథయాత్ర కూడా ప్రారంభమైంది. రాజకీయ నాయకులు ముఖ్యంగా VHP, BJP నుంచి రామజన్మభూమి యొక్క 'విముక్తి'కి మద్దతు తెలిపింది.

1992 సంవత్సరం ఒక క్లైమాక్స్- బాబ్రీ మసీదు కూల్చివేతకి సాక్షిగా నిలిచింది. సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ మసీదును ధ్వంసం చేశారు. దీంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి.

1993-1994: బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత భారతదేశం అంతటా మతపరమైన అల్లర్లు చెలరేగాయి. ఫలితంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. వివాదాస్పద ప్రాంతాన్ని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని డాక్టర్ ఇస్మాయిల్ ఫరూఖీ సవాలు చేశారు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.

2002-2003: అలహాబాద్ హైకోర్టు 2002లో కేసును విచారించడం ప్రారంభించింది , మసీదు కింద హిందూ దేవాలయం ఉన్నట్లు రుజువు చేస్తూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) తవ్వకాలు చేపట్టింది. దీనిపై న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది.

2009-10: 16 ఏళ్లలో 399 సిట్టింగ్‌ల తర్వాత, లిబర్‌హాన్ కమిషన్ తన నివేదికను సమర్పించింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన క్లిష్టమైన వివరాలను వెల్లడిస్తూ.. కీలక నేతల పాత్రను బయటపెట్టింది. లిబర్‌హాన్ కమిషన్ జూన్ 2009న తన నివేదికను సమర్పించింది.ఎల్‌కె అద్వానీ, వాజ్‌పేయి, ఇతర బీజేపీ నాయకుల పేర్లతో దాదాపు 17 సంవత్సరాల తర్వాత విచారణ ప్రారంభించింది.

2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హిందువులు, ముస్లింలు, భూమిని విభజించడం ద్వారా వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పైకోర్టులకు వెళ్లారు.

2019: సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. రామ మందిర నిర్మాణం కోసం మొత్తం వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగిస్తూ, మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని సుప్రీంకోర్టు కేటాయించింది.

2020లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 5న బాబ్రీ మసీదు స్థలంలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.

జనవరి 22, 2024న అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఆలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఈ క్రతువు జరగడంతో 500 ఏళ్ల వివాదానికి ముగింపు పలికినట్లయింది.

Updated On 22 Jan 2024 6:36 AM GMT
Ehatv

Ehatv

Next Story