రాహుల్ గాంధీ(Rahul Gandhi)విదేశాలకు వెళ్లి వ్యాపారవేత్త‌ల‌ను కలుస్తున్నారని కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) ఇటీవల ఆరోపించారు. గులాం నబీ ఆజాద్‌ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ.. కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీలపై మాట‌ల‌ దాడి చేస్తోంది. ఈ విష‌య‌మై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్(BJP MP Ravi Shankar Prasad) విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై గులాం నబీ ఆజాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయ‌న‌ విదేశాలకు వెళ్లినప్పుడల్లా వ్యాపారవేత్తలను కలుస్తారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఎవరిని కలుస్తారు?

రాహుల్ గాంధీ(Rahul Gandhi)విదేశాలకు వెళ్లి వ్యాపారవేత్త‌ల‌ను కలుస్తున్నారని కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) ఇటీవల ఆరోపించారు. గులాం నబీ ఆజాద్‌ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ.. కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీలపై మాట‌ల‌ దాడి చేస్తోంది. ఈ విష‌య‌మై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్(BJP MP Ravi Shankar Prasad) విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై గులాం నబీ ఆజాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయ‌న‌ విదేశాలకు వెళ్లినప్పుడల్లా వ్యాపారవేత్తలను కలుస్తారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఎవరిని కలుస్తారు? వీరి భేటీ ఎజెండా ఏమిటి? అని రవిశంకర్ ప్రసాద్ ప్ర‌శ్నించారు.

రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడల్లా చాలా మంది వ్యాపారవేత్తలను కలుస్తారని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రతి 4-5 నెలలకొకసారి విదేశాలకు వెళతారని.. అక్క‌డ‌ ఆయన ఎవరిని కలుస్తారు.. ఆ వ్యాపారవేత్త ఎవరు.. దేశం కచ్చితంగా తెలుసుకోవాలనుకుంటుంద‌ని ఆయన అన్నారు. రాహుల్ విదేశాల నుంచి తిరిగి వచ్చినప్పుడల్లా భారత్‌పై, ప్రధాని మోదీపై దాడి మరింత తీవ్రమవుతుందని పేర్కొన్నారు. దేశాన్ని నిర్వీర్యం చేసేందుకు రాహుల్ గాంధీ భారత వ్యతిరేక వ్యాపారవేత్తలతో కలిసి పనిచేస్తున్నారా? అని ప్ర‌శ్నించారు.

రాహుల్ గాంధీ దేశాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. వారి సమావేశం అజెండా ఏమిటి, రాహుల్ విదేశాల‌కు వెళ్లి ఇండియాకు తిరిగి వచ్చినప్పుడల్లా.. భారతదేశంపై, ప్రధానమంత్రిపై, దేశ పురోగతిపై దాడి మరింత తీవ్రమవుతుంది. గులాం నబీ ఆజాద్ వ్యాఖ్య‌ల‌పై రాహుల్ సమాధానం చెప్పాలని రవిశంకర్ అన్నారు.

Updated On 10 April 2023 4:51 AM GMT
Ehatv

Ehatv

Next Story