నచ్చిన చోటకు వెళ్లి నాలుగు రోజులపాటు కాలక్షేపం చేసి రావడానికి శరదృతువు కంటే మంచి సీజన్‌ మరొకటి ఉండదు. అది కూడా నవమి నాటి వెన్నెల నుంచి నిండు పున్నమి వరకు ప్రకృతి భలే పసందుగా ఉంటుంది. రంగులద్దుకున్న పుడమి తల్లి అందాలను వర్ణించడానికి కవులు పోటీపడతారు. నేల నాలుగు చెరగులా ఏదో ఒక వేడుక కనువిందు చేస్తుంటుంది. రాజస్థాన్‌ (Rajasthan)లోని పుష్కర్‌ ప్రాంతంలో జరిగే ఒంటెల సందడి అలాంటిదే! కళాకారులు గొంతులు సవరించుకున్నారు. వాయిద్యకారులు శ్రుతులు చేసుకున్నారు. హస్తకళా నిపుణులు తమ ఉత్పత్తులను అంగళ్లకు తరలించేశారు.అక్కడ జరుగుతున్న మెగా ఉత్సవానికి రేపే చివరి రోజు. అందుకే అంత హడావుడి.

Updated On 27 Nov 2023 5:14 AM
Ehatv

Ehatv

Next Story